జులై 15 న విడుదల కానున్న 'నాయకి'

- July 05, 2016 , by Maagulf
జులై 15 న విడుదల కానున్న 'నాయకి'

త్రిష ప్రధాన పాత్రలో గొవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'నాయకి'. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం కొన్ని కారణాల వల్ల 15న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మానందం, కోవై సరళ, మనోబాల, గణేష్‌ వెంకట్రామన్‌, సత్యం రాజేశ్‌, జయప్రకాశ్‌ తదితరులు ఈ చిత్రం ప్రధాన పాత్రలు పోషించారు. రఘు కుంచె చిత్రానికి సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్రిష తొలిసారి లేడీ ఓరియెంటెడ్‌లో నటించిన చిత్రమిది.ప్రస్తుతం ఆమె 'మోహిని' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం లండన్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com