కార్తీ కథానాయకుడిగా మణిరత్నం చిత్రo..
- July 05, 2016
ఎస్ డెరైక్టర్ మణిరత్నం తాజా చిత్రం ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఓ కాదల్ కణ్మణి వంటి విజయవంతమైన చిత్రం తరువాత మణిరత్నం కొన్ని ప్రాజెక్ట్లు అనుకున్నా అనివార్యకారణాల వల్ల అవి ఆచరణలోకి రాలేదు. దీంతో ఈ ప్రఖ్యాత దర్శకుడి చిత్రం ఇదిగో,అదిుగో ప్రారంభం అవుతోంది అంటూ ప్రచారాలకే పరిమితమైంది. ఇప్పటికీ ఆయన తాజా చిత్రం సెట్ అయ్యింది. కార్తీ కథానాయకుడిగా మణిరత్నం చిత్రాన్ని మొదలెడుతున్నారు. ఇందులో కార్తీకి జంటగా ముంబై బ్యూటీ అదితిరావును ఎంపిక చేశారు.అంతే కాదు ఈ చిత్రానికి కాట్రు వెలియిడై అనే టైటిల్ను కూడా మణిరత్నం ఫిక్స్ చేశారన్నది తాజా సమాచారం. ఇందులో కార్తీ విమాన పైలట్గా నటించనున్నట్లు తెలిసిందే. ఇందుకోసం ఆయన చాలా కసరత్తులు చేసి స్లిమ్గా తయారయ్యారట. ఈ చిత్ర షూటింగ్ 8వ తేదీ నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. తొలుత పాటతో మొదలయ్యే ఈ కాట్రు వెలియిడై చిత్రం అక్కడ 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోనున్నట్లు తెలిసింది. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని, రవివర్మ చాయాగ్రహణను, వైరముత్తు పాటలను అందిస్తున్నారు. మణిరత్నం తన మెడ్రాస్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల హక్కుల్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందినట్లు, దీన్ని ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









