ముషీరెబ్ డౌన్‌టౌన్ దోహాలో 30% పెరిగిన విజిటర్స్..!!

- March 25, 2025 , by Maagulf
ముషీరెబ్ డౌన్‌టౌన్ దోహాలో 30% పెరిగిన విజిటర్స్..!!

దోహా, ఖతార్: ముషీరెబ్ డౌన్‌టౌన్ దోహాలో రమదాన్ సందర్భంగా విజిటర్స్ సంఖ్య అనుహ్యంగా పెరిగింది.  మార్చి 1 - 19 మధ్య, ఇది ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సందర్శకులను స్వాగతించింది. 2024తో పోలిస్తే ఇది 30% పెరుగుదల కావడం గమనార్హం.

ముషీరెబ్ ప్రాపర్టీస్‌లోని కార్పొరేట్ కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ హఫీజ్ అలీ అబ్దుల్లా మాట్లాడుతూ.. ముషీరెబ్ డౌన్‌టౌన్ దోహాలో రమదాన్ నెల వేడుకల సందర్శకుల రాక పెరిగిందని తెలిపారు.  ఈ ప్రత్యేక సమయంలో ఖతార్ చుట్టుపక్కలతోపాటు వివిధ దేశాలకు చెందిన వారు తరలివస్తున్నారని పేర్కొన్నారు.  ముఖ్యంగా మార్చి 14, 15 తేదీలలో జరిగిన గరంగో వేడుకలకు వేలాది మంది విజిటర్స్ తరలివచ్చారని తెలిపారు.  ఇంకా, హోష్ ముషీరెబ్ ఒక ప్రముఖ కమ్యూనిటీ ప్లేస్ గా గుర్తింపు పొందింది. మొత్తం 12,000 మంది సందర్శకులను స్వాగతించిందని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com