ఆన్ లైన్ బెట్టింగ్ నిరోధానికి సిట్ ఏర్పాటు: సీఎం రేవంత్
- March 26, 2025
హైదరాబాద్: ఆన్ లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఆన్ లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.శాంతి భద్రతల అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ…ఆన్ లైన్ బెట్టింగ్ నిరోధానికి, నిషేధించేందుకు సిట్ వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను సైతం సవరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
రాష్ట్రంలోకి పెటుబడులు రాకుండా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ విషప్రచారం చేస్తుందంటూ విమర్శించారు.. గత కేసీఆర్ పాలనలో దిశ ఘటన జరిగిందని, వామనరావు దంపతులను నడిరోడ్డుపై నరికి హత్య చేశారని గుర్తు చేశారు. ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎంఎంటీఎస్ లో ఘటన జరిగిన వెంటనే తాము స్పందించామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. భాదితురాలికి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామన్నారు. తమ పాలనలోనే శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!