వ్యాట్ నుంచి ఆ ఆహారపదార్థాలకు మినహాయింపు
- July 06, 2016
జిసిసి దేశాల్లో వ్యాట్ అమల్లోకి వచ్చిన తరువాత అందులోంచి కొన్ని ఆహార పదార్థాలకు మినహాయింపు ఇవ్వనున్నారు. 2018 నాటికి జిసిసి దేశాల్లో వ్యాట్ అమల్లోకి రానుంది. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా వ్యాట్ని అమల్లోకి తీసుకురానున్నారు. అయితే హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ మరియు సోషల్ సర్వీసులను ఈ వ్యాట్ నుంచి మినహాయిస్తారు. అలాగే, కొన్ని ఆహార పదార్థాలపై వ్యాట్ని మినహాయించనున్నారు. తాజా పళ్ళు, టీ, గోధుమలు, పంచదార, ఇన్ఫాంట్ మిల్క్ ఫుడ్స్, అన్ కుక్డ్ పాస్తా మరికొన్ని ఆహార పదార్థాలకు వ్యాట్ నుంచి మినహాయింపు ఉంటుందని ఇవై ఒమన్ ఆఫీస్ మేనేజింగ్ పార్టనర్ అహ్మద్ అమోర్ అల్ ఎస్రి చెప్పారు. లగ్జరీ ఐటమ్స్ ధరలు వ్యాట్ కారణంగా పెరుగుతాయనీ, బెవరేజెస్లోనూ ఈ పెరుగుదల కనిపిస్తుందని ఆయన అంచనా వేశారు. కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాల ధరలూ పెరిగే అవకాశం ఉంది. బేసిక్ ఫుడ్ ఐటమ్స్ మీద మాత్రం వ్యాట్ మినహాయింపు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









