290 మిలియన్ల ఆర్డర్ల డెలివరీలు..45%తో రియాద్ టాప్..!!
- April 07, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని డెలివరీ కంపెనీలు 2024 సంవత్సరంలో అద్భుతమైన వృద్ధిని సాధించాయని, నమోదైన ఆర్డర్ల సంఖ్య 290 మిలియన్లను మించిందని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) వెల్లడించింది. ఈ పెరుగుదల లాజిస్టిక్స్ మార్కెట్ నిరంతర విస్తరణ, వేగవంతమైన, సౌకర్యవంతమైన డెలివరీల కోసం పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం, 61 కంపెనీలు డెలివరీ రంగంలో పనిచేయడానికి TGA ద్వారా లైసెన్స్ పొందాయని తెలిపారు.
రియాద్ ప్రాంతం 130.5 మిలియన్లకు పైగా ఆర్డర్లతో అగ్రస్థానంలో ఉంది. ఇది డెలివరీ కంపెనీలు నిర్వహించే మొత్తం డెలివరీలలో 45.3 శాతం. రియాద్ తర్వాత మక్కా ప్రాంతం 65.4 మిలియన్ ఆర్డర్లతో (22.7 శాతం), తూర్పు ప్రావిన్స్ 43.2 మిలియన్ ఆర్డర్లతో (15 శాతం) తర్వాతి ప్లేసులో ఉన్నాయి. మదీనా ప్రాంతం 12.3 మిలియన్ ఆర్డర్లను (4.3 శాతం) నమోదు చేయగా, అసిర్ ప్రాంతం 9.4 మిలియన్ ఆర్డర్లను (3.2 శాతం) నమోదు చేసింది. అసిర్ తర్వాత ఖాసిమ్ ప్రాంతం 8.5 మిలియన్ ఆర్డర్లతో (2.9 శాతం), తరువాత తబుక్ 5.2 మిలియన్ ఆర్డర్లతో (1.8 శాతం), హెయిల్ 4.1 మిలియన్ ఆర్డర్లతో (1.4 శాతం), జజాన్ 3.3 మిలియన్ ఆర్డర్లతో (1.1 శాతం) ఉన్నాయి.
స్మార్ట్ అప్లికేషన్లు పౌరులు, ప్రవాసుల జీవితాల్లో అంతర్భాగంగా మారాయని, ఈ అప్లికేషన్లపై వినియోగదారులు ఆధారపడటం డిమాండ్ను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అథారిటీ నొక్కి చెప్పింది. రాజ్యంలో 50 కంటే ఎక్కువ లైసెన్స్ పొందిన డెలివరీ కంపెనీలు ఉండటం దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. దాంతోపాటు మారుతున్న వినియోగదారుల ప్రవర్తన, ఇ-కామర్స్పై పెరుగుతున్న ఆధారపడటం డెలివరీ సేవలకు డిమాండ్ను పెంచాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి