దిల్సుఖ్నగర్ బాంబు పేలుడు కేసులో ఇంకా పరారీలో ఉన్న మహమ్మద్ రియాజ్
- April 08, 2025
హైదరాబాద్: 2013 ఫిబ్రవరి 21వ తేదీ దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో ఆ ఇద్దరు బాంబులు పేల్చిన ఆ కొద్దిసేపు దేశం మొత్తం షాక్కు గురైంది. హైదరాబాదును కుదిపేసిన ఈ ఘటనలో 18 మందికి పైగా మృతి చెందారు. 130 మందికి పైగా గాయపడ్డారు.ఈ పేలుళ్ల వెనక ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఉన్నట్లు స్పష్టమైంది.నిందితులుగా గుర్తించబడిన ఐదుగురిపై విచారణ, దర్యాప్తు, కోర్టు తీర్పుల అనంతరం చివరికి తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు సంచలన తీర్పు
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు 2016లో ఐదుగురికి మరణశిక్ష విధించింది. వారు ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ తాజాగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ (జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ సుధలు) తీర్పును సమీక్షించి, ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది. అంటే మరణశిక్ష కొనసాగుతుంది. ఇది బాధిత కుటుంబాలకు ఓ న్యాయం చేసినట్టే.
శిక్ష పడిన దోషులు వీరే
అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డి, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వాఘాస్ / నబీల్ అహ్మద్, మహ్మద్ తహ్సీన్ అక్తర్ అలియాస్ హసన్, యాసిన్ భత్కల్ అలియాస్ షారుఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండే, ఈ ఐదుగురిపై ఉగ్రవాద చట్టాలు, హత్య, కుట్ర, పేలుడు పదార్థాల చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. వీరిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుని, వివరంగా విచారణ జరిపింది.
ప్రధాన నిందితుడు పరారీలో
కేసులో ప్రధాన సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ స్థాపకుడు మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతను పాకిస్తాన్లోని కరాచీలో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతని అరెస్ట్తోనే ఈ కేసు పూర్తిగా మూసివేయబడి న్యాయం జరుగుతుంది. కేంద్రం అతని జాతీయ, అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కోసం కృషి చేస్తోంది. ఈ కేసు హైకోర్టులో దాఖలైన తర్వాత, 45 రోజులపాటు విచారణ జరిగింది. దర్యాప్తు అధికారులు, బాధితుల వాదనలు, నిందితుల పక్షాన వాదనలు అన్నీ విశ్లేషించిన అనంతరం న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు వారి తీర్పుతో ఈ కేసులో ఒక కీలక మలుపు తిరిగింది. ఈ పేలుళ్లలో గాయపడ్డ పలువురు బాధితులు ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా బాధపడుతూనే ఉన్నారు. శాశ్వతంగా వికలాంగులుగా మారిన వారు, జ్ఞాపకాలు మరిచిపోలేని కుటుంబ సభ్యులు — ఇవన్నీ ఈ దారుణానికి గుర్తులే. వారికి జరిగిన నష్టం తిరిగి వచ్చే కాదు కానీ న్యాయమైన శిక్ష మాత్రం కొంత న్యాయం అందించినట్టయింది. ఈ తీర్పు ఉగ్రవాదంపై దేశం ఉక్కుపాదం మోపుతోందని ప్రపంచానికి చూపించేదిగా ఉంది. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతకు పెద్ద ముప్పుగా ఉన్న ఉగ్రవాదంపై దీటైన చర్యగా ఇది పేర్కొనవచ్చు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న సంకేతంగా ఈ తీర్పు నిలిచిపోతుంది. 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్సుఖ్ నగర్లో సంభవించిన ఈ జంట పేలుళ్ల ఘటన యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో 18 మందికి పైగా మరణించారు. 131 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇఫ్పటికీ చాలామంది కోలుకోవట్లేదు. కొందరు శాశ్వతంగా వికలాంగులయ్యారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







