2026లో ప్రారంభం కానున్న భారత్ మార్ట్..!!
- April 11, 2025
యూఏఈ: భారతీయ ఉత్పత్తులను అందించే భారత్ మార్ట్ 2026 చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. జెబెల్ అలీ ఫ్రీ జోన్ (JAFZA)లో నిర్మాణంలో ఉన్న భారత్ మార్ట్ 2.7 మిలియన్ చదరపు అడుగులకు పైగా రిటైల్, షోరూమ్లను కలిగి ఉంది.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భారత్ లో తన మొదటి అధికారిక పర్యటనను ముగించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. చైనీస్ డ్రాగన్ మార్ట్తో పోలిస్తే, భారత్ మార్ట్ దుబాయ్లో బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) మార్కెట్ప్లేస్గా ఉంటుందని, ఇది భారతీయ వ్యాపారాలు, ప్రపంచ మార్కెట్ల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ భారత్ మార్ట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని DP వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయెమ్ ప్రకటించారు.
జెబెల్ అలీ పోర్ట్ నుండి కేవలం 11 కి.మీ దూరంలో, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 15 కి.మీ దూరంలో ఉంటుంది. భారత్ మార్ట్, భారతీయ వ్యాపారాలకు మల్టీమోడల్ లాజిస్టిక్స్ నెట్వర్క్ను ఎతిహాద్ రైలు అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!









