2026లో ప్రారంభం కానున్న భారత్ మార్ట్..!!
- April 11, 2025
యూఏఈ: భారతీయ ఉత్పత్తులను అందించే భారత్ మార్ట్ 2026 చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. జెబెల్ అలీ ఫ్రీ జోన్ (JAFZA)లో నిర్మాణంలో ఉన్న భారత్ మార్ట్ 2.7 మిలియన్ చదరపు అడుగులకు పైగా రిటైల్, షోరూమ్లను కలిగి ఉంది.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భారత్ లో తన మొదటి అధికారిక పర్యటనను ముగించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. చైనీస్ డ్రాగన్ మార్ట్తో పోలిస్తే, భారత్ మార్ట్ దుబాయ్లో బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) మార్కెట్ప్లేస్గా ఉంటుందని, ఇది భారతీయ వ్యాపారాలు, ప్రపంచ మార్కెట్ల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ భారత్ మార్ట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని DP వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయెమ్ ప్రకటించారు.
జెబెల్ అలీ పోర్ట్ నుండి కేవలం 11 కి.మీ దూరంలో, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 15 కి.మీ దూరంలో ఉంటుంది. భారత్ మార్ట్, భారతీయ వ్యాపారాలకు మల్టీమోడల్ లాజిస్టిక్స్ నెట్వర్క్ను ఎతిహాద్ రైలు అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!
- జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తం కావాలంటూ విమానయాన సంస్థలకు కేంద్ర మంత్రి సూచనలు
- విమానయాన ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చర్యలు: GCAA
- జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్ దాడి..ఒకరు మృతి..!!
- ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించిన ఇరాన్
- బుర్జ్ అల్ అరబ్ సమీపంలో డ్రోన్ దాడి..అదుపులోకి మంటలు..!!









