2026లో ప్రారంభం కానున్న భారత్ మార్ట్..!!

- April 11, 2025 , by Maagulf
2026లో ప్రారంభం కానున్న భారత్ మార్ట్..!!

యూఏఈ: భారతీయ ఉత్పత్తులను అందించే భారత్ మార్ట్ 2026 చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. జెబెల్ అలీ ఫ్రీ జోన్ (JAFZA)లో నిర్మాణంలో ఉన్న భారత్ మార్ట్ 2.7 మిలియన్ చదరపు అడుగులకు పైగా రిటైల్, షోరూమ్‌లను కలిగి ఉంది.  

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భారత్ లో తన మొదటి అధికారిక పర్యటనను ముగించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. చైనీస్ డ్రాగన్ మార్ట్‌తో పోలిస్తే, భారత్ మార్ట్ దుబాయ్‌లో బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) మార్కెట్‌ప్లేస్‌గా ఉంటుందని, ఇది భారతీయ వ్యాపారాలు, ప్రపంచ మార్కెట్ల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి రూపొందించినట్లు అధికారులు తెలిపారు.  ఈ భారత్ మార్ట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని DP వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయెమ్ ప్రకటించారు.

జెబెల్ అలీ పోర్ట్ నుండి కేవలం 11 కి.మీ దూరంలో, అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 15 కి.మీ దూరంలో ఉంటుంది. భారత్ మార్ట్, భారతీయ వ్యాపారాలకు మల్టీమోడల్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను ఎతిహాద్ రైలు అందిస్తుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com