5.2లక్షలకు చేరిన కార్పొరేట్ పన్ను కోసం నమోదు చేసుకున్న కంపెనీల సంఖ్య..!!
- April 15, 2025
యూఏఈః యూఏఈలో కార్పొరేట్ పన్ను కోసం నమోదు చేసుకున్న కంపెనీల సంఖ్య 520,000కి చేరుకుంది. విలువ ఆధారిత పన్ను కింద ఉన్న కంపెనీల సంఖ్య 470,000 అని ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తెలిపారు. అబుదాబిలోని ఖాసర్ అల్ వతన్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో షేక్ మొహమ్మద్ ఈ మేరకు వెల్లడించారు.“ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇచ్చే యూఏఈ పన్ను వ్యవస్థ పురోగతిపై సమీక్షించాము. స్విట్జర్లాండ్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (IMD) వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను విధాన సామర్థ్యంలో యూఏఈ ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానంలో , పన్ను ఎగవేతను ఎదుర్కోవడంలో రెండవ స్థానంలో ఉంది." అని వివరించారు. దేశంలోని అన్ని సమాఖ్య, స్థానిక చట్టాలను కలిగి ఉన్న సమగ్ర శాసన పటాన్ని అభివృద్ధి చేయడానికి యూఏఈ క్యాబినెట్లో నియంత్రణ శాసన నిఘా కోసం కొత్త కార్యాలయం ఏర్పాటు చేయబడుతుందని సమావేశంలో ప్రకటించారు.
యూఏఈ పారిశ్రామిక రంగం పురోగతికి మద్దతు ఇచ్చే "మేక్ ఇట్ ఇన్ ది ఎమిరేట్స్" ఫోరమ్ను నిర్వహించడానికి పరిశ్రమ, అధునాతన సాంకేతిక మంత్రిత్వ శాఖ ఎలా సిద్ధమవుతుందో కూడా సమావేశం సమీక్షించింది. "మా పారిశ్రామిక రంగం మా స్థూల దేశీయోత్పత్తికి Dh210 బిలియన్లను అందిస్తుంది మరియు గత నాలుగు సంవత్సరాలలో 59 శాతం వృద్ధిని సాధించింది" అని షేక్ మొహమ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









