SMS స్కామ్‌.. క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఛేదించిన అధికారులు..!!

- April 22, 2025 , by Maagulf
SMS స్కామ్‌.. క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఛేదించిన అధికారులు..!!

దోహా, ఖతార్: బ్యాంకులు, అధికారిక ప్రభుత్వ సంస్థల వలె నకిలీ లింక్‌లు, మోసపూరిత SMS లను పంపుతున్న ముఠా నెట్ వర్క్ ను ఖతార్ అధికారులు ఛేదించారు. పలు మోసాలకు పాల్పడుతున్న ఖతార్‌లోని వివిధ ప్రాంతాలలో కమ్యూనికేషన్ టవర్‌లను లక్ష్యంగా చేసుకున్న 12 మంది ఆసియా సంతతికి చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి క్రిమినల్ నెట్‌వర్క్‌ను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం విజయవంతంగా అడ్డుకుంది.

ఈ మోసపూరిత లింకులు, మెసేజులతో పౌరులు, నివాసితుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.  క్రెడిట్ కార్డ్ డేటా, ఇతర సున్నితమైన సమాచారం చోరీ చేసి వాటిసాయంతో వారి ఖాతాలను ఖాళీ చేస్తారని అధికారులు వివరించారు.

SMS లేదా మెసేజింగ్ అప్లికేషన్‌ల ద్వారా వచ్చే ఏవైనా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏదైనా ఫ్రాడ్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com