SMS స్కామ్.. క్రిమినల్ నెట్వర్క్ను ఛేదించిన అధికారులు..!!
- April 22, 2025
దోహా, ఖతార్: బ్యాంకులు, అధికారిక ప్రభుత్వ సంస్థల వలె నకిలీ లింక్లు, మోసపూరిత SMS లను పంపుతున్న ముఠా నెట్ వర్క్ ను ఖతార్ అధికారులు ఛేదించారు. పలు మోసాలకు పాల్పడుతున్న ఖతార్లోని వివిధ ప్రాంతాలలో కమ్యూనికేషన్ టవర్లను లక్ష్యంగా చేసుకున్న 12 మంది ఆసియా సంతతికి చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి క్రిమినల్ నెట్వర్క్ను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం విజయవంతంగా అడ్డుకుంది.
ఈ మోసపూరిత లింకులు, మెసేజులతో పౌరులు, నివాసితుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. క్రెడిట్ కార్డ్ డేటా, ఇతర సున్నితమైన సమాచారం చోరీ చేసి వాటిసాయంతో వారి ఖాతాలను ఖాళీ చేస్తారని అధికారులు వివరించారు.
SMS లేదా మెసేజింగ్ అప్లికేషన్ల ద్వారా వచ్చే ఏవైనా అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏదైనా ఫ్రాడ్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







