SMS స్కామ్.. క్రిమినల్ నెట్వర్క్ను ఛేదించిన అధికారులు..!!
- April 22, 2025
దోహా, ఖతార్: బ్యాంకులు, అధికారిక ప్రభుత్వ సంస్థల వలె నకిలీ లింక్లు, మోసపూరిత SMS లను పంపుతున్న ముఠా నెట్ వర్క్ ను ఖతార్ అధికారులు ఛేదించారు. పలు మోసాలకు పాల్పడుతున్న ఖతార్లోని వివిధ ప్రాంతాలలో కమ్యూనికేషన్ టవర్లను లక్ష్యంగా చేసుకున్న 12 మంది ఆసియా సంతతికి చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి క్రిమినల్ నెట్వర్క్ను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక, సైబర్ నేరాల పోరాట విభాగం విజయవంతంగా అడ్డుకుంది.
ఈ మోసపూరిత లింకులు, మెసేజులతో పౌరులు, నివాసితుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. క్రెడిట్ కార్డ్ డేటా, ఇతర సున్నితమైన సమాచారం చోరీ చేసి వాటిసాయంతో వారి ఖాతాలను ఖాళీ చేస్తారని అధికారులు వివరించారు.
SMS లేదా మెసేజింగ్ అప్లికేషన్ల ద్వారా వచ్చే ఏవైనా అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏదైనా ఫ్రాడ్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







