రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- April 30, 2025
న్యూ ఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలర్ట్.. మే 1 నుంచి భారత రైల్వేలో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈసారి రైల్వేలో నియమాల్లో పెద్ద మార్పు ఉండబోతోంది. ఈ కొత్త నిబంధనల కారణంగా రైల్వే ప్రయాణికులపై ప్రభావం పడనుంది.
ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులపైనే ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే.. స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు ఇకపై అనుమతించరు. వెయిటింగ్ లిస్టు కలిగిన ప్రయాణికులు జనరల్ క్లాస్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది.
మే 1 నుంచి కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు భారత రైల్వే కొత్త నియమాలను తీసుకొస్తోంది. IRCTC ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్లోనే ఉంటే.. అది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. అయితే, కౌంటర్ నుంచి వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు కొనుగోలు చేసే చాలా మంది ప్రయాణీకులు ఇప్పటికీ స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణిస్తారు.
స్లీపర్, ఏసీలో ప్రయాణం నిషేధం:
వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించడం నిషేధమని గమనించాలి. అదేవిధంగా, వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులు ఈ కోచ్లలో సీటులో కూర్చుని ఉన్నట్లు తేలితే.. వారికి జరిమానా విధించడం లేదా జనరల్ కంపార్ట్మెంట్కు తరలించే హక్కు TTEకి ఉంటుంది.
వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకు ప్రయాణ సమయంలో అసౌకర్యం కలగకుండా కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల సౌకర్యం కోసం ఈ నిబంధనను అమలు చేసినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశి కిరణ్ తెలిపారు.
వెయిటింగ్ టికెట్లతో కష్టమే:
తరచుగా వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణిస్తుంటారు. అదే సమయంలో కన్ఫార్మడ్ టిక్కెట్లు ఉన్నవారి సీట్లలో కూర్చొంటారు. దీనివల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా, ఈ కోచ్లలో వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల సంఖ్య పెరిగినప్పుడు సీట్లు బ్లాక్ అవుతాయి.
ప్రయాణికుల కదలిక కష్టతరం అవుతుంది. ప్రయాణీకులందరికీ ప్రయాణం అసౌకర్యంగా ఉంటుంది. మీరు తరచుగా వెయిటింగ్ టిక్కెట్లతో ప్రయాణిస్తుంటే.. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయాణాన్ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రయాణం సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!