22 న విడుదల కానున్న 'జక్కన్న' సినిమా
- July 08, 2016
సునీల్, మన్నారా చోప్రా జంటగా రూపుదిద్దుకున్న 'జక్కన్న' చిత్రాన్ని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. హీరో సునీల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. అందరికీ వినోదం పంచడం కోసం జులై 22న వస్తున్నట్లు ట్వీట్ చేశారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతం సమకూర్చారు. ఆర్. సుదర్శన్రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సి. రామ్ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎందుకూ పనికిరాడు అనిపించుకున్న ఓ యువకుడు తనని తాను శిల్పంలా తీర్చిదిద్దుకొన్న వైనం ఎలాంటిదనే కథతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇటీవల నిర్మాత తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







