తెలివైన పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి
- July 08, 2016
ప్రతి మహిళా తల్లి కావాలని ఎలా ఆరాటపడుతుందో పుట్టే పిల్లలు తెలివైన వారై ఉండాలని అనుకుంటుంది. తెలివైన పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి అనే అంశంపై పరిశోధకులు చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గర్భధారణ సమయంలో పండ్లు అధికంగా తినే మహిళలు తెలివైన పిల్లలకు జన్మనిస్తున్నారని వెల్లడైంది. మహిళలు గర్భధారణ టైంలో ఎక్కువగా పండ్లు తింటే వాళ్లకు పుట్టే పిల్లల్లో మేధస్సు త్వరగా వృద్ధి చెందుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడాలోని ఆల్బెర్టా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 800మంది చిన్నారులను పరిశీలించారు. అంతేగాక వీరి కుటుంబ ఆదాయం, తల్లిదండ్రుల చదువు వంటి అంశాలను కూడా వీరు నమోదు చేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని ఐక్యూని గణించారు. సగటున 100పాయింట్లు నిర్ధారించగా 65శాతం మంది పిల్లలు 85 నుంచి 115 ఐక్యూ కలిగి ఉన్నారని తేలింది. రోజుకి ఆరు లేదా ఏడుసార్లు పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకున్న గర్భిణులకు పుట్టిన పిల్లలు 6 నుంచి ఏడు పాయింట్లు అధికంగా సాధించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









