తెలివైన పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి
- July 08, 2016
ప్రతి మహిళా తల్లి కావాలని ఎలా ఆరాటపడుతుందో పుట్టే పిల్లలు తెలివైన వారై ఉండాలని అనుకుంటుంది. తెలివైన పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి అనే అంశంపై పరిశోధకులు చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గర్భధారణ సమయంలో పండ్లు అధికంగా తినే మహిళలు తెలివైన పిల్లలకు జన్మనిస్తున్నారని వెల్లడైంది. మహిళలు గర్భధారణ టైంలో ఎక్కువగా పండ్లు తింటే వాళ్లకు పుట్టే పిల్లల్లో మేధస్సు త్వరగా వృద్ధి చెందుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడాలోని ఆల్బెర్టా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 800మంది చిన్నారులను పరిశీలించారు. అంతేగాక వీరి కుటుంబ ఆదాయం, తల్లిదండ్రుల చదువు వంటి అంశాలను కూడా వీరు నమోదు చేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని ఐక్యూని గణించారు. సగటున 100పాయింట్లు నిర్ధారించగా 65శాతం మంది పిల్లలు 85 నుంచి 115 ఐక్యూ కలిగి ఉన్నారని తేలింది. రోజుకి ఆరు లేదా ఏడుసార్లు పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకున్న గర్భిణులకు పుట్టిన పిల్లలు 6 నుంచి ఏడు పాయింట్లు అధికంగా సాధించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







