తెలివైన పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి
- July 08, 2016
ప్రతి మహిళా తల్లి కావాలని ఎలా ఆరాటపడుతుందో పుట్టే పిల్లలు తెలివైన వారై ఉండాలని అనుకుంటుంది. తెలివైన పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి అనే అంశంపై పరిశోధకులు చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గర్భధారణ సమయంలో పండ్లు అధికంగా తినే మహిళలు తెలివైన పిల్లలకు జన్మనిస్తున్నారని వెల్లడైంది. మహిళలు గర్భధారణ టైంలో ఎక్కువగా పండ్లు తింటే వాళ్లకు పుట్టే పిల్లల్లో మేధస్సు త్వరగా వృద్ధి చెందుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడాలోని ఆల్బెర్టా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 800మంది చిన్నారులను పరిశీలించారు. అంతేగాక వీరి కుటుంబ ఆదాయం, తల్లిదండ్రుల చదువు వంటి అంశాలను కూడా వీరు నమోదు చేసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని ఐక్యూని గణించారు. సగటున 100పాయింట్లు నిర్ధారించగా 65శాతం మంది పిల్లలు 85 నుంచి 115 ఐక్యూ కలిగి ఉన్నారని తేలింది. రోజుకి ఆరు లేదా ఏడుసార్లు పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకున్న గర్భిణులకు పుట్టిన పిల్లలు 6 నుంచి ఏడు పాయింట్లు అధికంగా సాధించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









