హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు షురూ..
- May 10, 2025
హైదరాబాద్: హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ 72 ఎడిషన్ పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. తెలంగాణ కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ప్రారంభోత్సవం జరిగింది.
మిస్ వరల్డ్ ప్రారంభోత్సవంలో తమ దేశాల సంస్కృతి, సాంప్రదాయ వేషధారణలతో ఆయా దేశాల కంటెస్టర్లు అలరించారు. 110కిపైగా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఇండియా తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తోంది. మిస్ ఇండియా నందిని గుప్తా వచ్చినపుడు కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమోగింది. ఇవాళ 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన చేశారు. మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!