హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు షురూ..
- May 10, 2025
హైదరాబాద్: హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ 72 ఎడిషన్ పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. తెలంగాణ కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ప్రారంభోత్సవం జరిగింది.
మిస్ వరల్డ్ ప్రారంభోత్సవంలో తమ దేశాల సంస్కృతి, సాంప్రదాయ వేషధారణలతో ఆయా దేశాల కంటెస్టర్లు అలరించారు. 110కిపైగా దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఇండియా తరఫున మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తోంది. మిస్ ఇండియా నందిని గుప్తా వచ్చినపుడు కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమోగింది. ఇవాళ 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన చేశారు. మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









