ఈ-పాస్పోర్ట్ ప్రారంభించిన ఇండియా.. ప్రయాణికులు తెలుసుకోవలసిన ముఖ్యమైన వివరాలు..!!
- May 14, 2025
న్యూఢిల్లీ: పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 కింద సాంప్రదాయ పాస్పోర్ట్ డిజైన్తో ఎలక్ట్రానిక్ ఫీచర్లను అనుసంధానిస్తూ ఇండియా అనేక నగరాల్లో ఈ-పాస్పోర్ట్లను ప్రారంభించింది. ఈ ఈ-పాస్పోర్ట్లు సురక్షితమైన డేటాతోపాటు మెరుగైన భద్రతా లక్షణాల కోసం RFID చిప్ను కలిగి ఉన్నాయి. సాంప్రదాయ పాస్పోర్ట్లు గడువు ముగిసే వరకు చెల్లుబాటులో ఉన్నప్పటికీ, 2025 మధ్య నాటికి దేశవ్యాప్తంగా ఈ-పాస్పోర్ట్ లభ్యతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇప్పటికే చెన్నైలో మార్చి నెల నుండి జారీ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా భద్రత, గుర్తింపు ప్రక్రియలను మెరుగుపరచడానికి, దేశంలోని వివిధ నగరాల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ-పాస్పోర్ట్లను ప్రవేశపెట్టింది. ప్రయాణ డాక్యుమెంటేషన్ ప్రక్రియను మెరుగుపరచడం, ఆధునీకరించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంటున్నారు. నివేదికల ప్రకారం.. కొత్త ఈ-పాస్పోర్ట్లు సాంప్రదాయ పాస్పోర్ట్ బుక్లెట్ల డిజైన్తో ఎలక్ట్రానిక్ ఫీచర్లను కలిగిఉన్నాయి. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం (PSP) వెర్షన్ 2.0 కింద ఇ-పాస్పోర్ట్ల రోలింగ్ ను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇ-పాస్పోర్ట్ల ప్రత్యేకత
కొత్త ఇ-పాస్పోర్ట్లో అంతర్నిర్మిత యాంటెన్నా, ఎంబెడెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ ఉన్నాయి. ఇవి రెండూ పాస్పోర్ట్ కవర్లో ఉన్నాయి. ఈ అధునాతన డిజైన్ హోల్డర్ వ్యక్తిగత, బయోమెట్రిక్ డేటాను సురక్షితంగా నిల్వ చేయవచ్చు.
ఈ-పాస్పోర్ట్ల ప్రధాన ప్రయోజనాలు
అధిక స్థాయి డేటా రక్షణ, ఎంబెడెడ్ చిప్ ట్యాంపరింగ్, ఫోర్జరీ, గుర్తింపు దొంగతనం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అంతర్జాతీయ ప్రయాణ సమయంలో గుర్తింపు తనిఖీల సామర్థ్యం మరియు విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సురక్షిత చిప్ ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం, బయోమెట్రిక్ ఐడెంటిఫైయర్లను స్టోర్ చేస్తుంది. వీటిని కాపీ చేయడం లేదా మార్చడం చాలా కష్టం.
ఇ-పాస్పోర్ట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్న నగరాలు
నాగ్పూర్, భువనేశ్వర్, జమ్మూ, గోవా, సిమ్లా, రాయ్పూర్, అమృత్సర్, జైపూర్, చెన్నై, హైదరాబాద్, సూరత్, రాంచీ, ఢిల్లీ. 2025 మిడిల్ నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలను కవర్ చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
తమిళనాడులోని చెన్నైలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం మార్చి 3న ఈ-పాస్పోర్ట్లను జారీ చేయడం ప్రారంభించింది. మార్చి 22 నాటికి, రాష్ట్రంలో ఇప్పటికే 20,700 కంటే ఎక్కువ ఈ-పాస్పోర్ట్లు పంపిణీ చేశారు.
పాత/సాంప్రదాయ పాస్పోర్ట్ల పరిస్థితి
విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉన్న/సాంప్రదాయ పాస్పోర్ట్లు వాటి గడువు తేదీల వరకు చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ-పాస్పోర్ట్ లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పౌరులు వెంటనే ఈ-పాస్పోర్ట్లకు మారవలసిన అవసరం లేదు. ఈ-పాస్పోర్ట్ల పరిచయం సురక్షితమైన, సాంకేతికత విషయంలో కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇది భారతీయ పౌరులకు సమయం, సురక్షిత గుర్తింపు, అంతర్జాతీయ ప్రయాణాన్ని అందిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
తాజా వార్తలు
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!









