యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- March 02, 2026
యూఏఈః పశ్చిమాసియా అగ్నిగుండగా మారింది. గల్ఫ్ దేశాలలో హై అలెర్ట్ కొనసాగుతోంది. జీసీసీ దేశాలు తమ గగనతలాలను పూర్తి మూసివేశాయి. మరోవైపు, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఏకంగా 165 బాలిస్టిక్ మిస్సైల్స్, 541 డ్రోన్లను ప్రయోగించింది. కాగా, ఇందులో 152 మిస్సైళ్లను గాలిలోనే అడ్డుకున్నామని, మరో 13 సముద్రంలో కూలిపోయాయని యూఏఈ ప్రకటించింది. అలాగే, 506 డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్నామని, కానీ 35 డ్రోన్లు మాత్రం రెసిడెన్షియల్ ప్రాంతాలను ఢీకొట్టాయని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు వివిధ దేశాలకు చెందిన మొత్తం ముగ్గురు ప్రవాసులు మరణించగా, 58 మంది ప్రవాసులు గాయపడ్డారని యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అయితే, మిస్సైల్స్ మరియు డ్రోన్ల నుండి వచ్చిన శిథిలాలు సివిలియన్ ఆస్తులకు నష్టాన్ని కలిగించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ నుండి జరుగుతున్న దాడులను యూఏఈ వైమానిక దళం మరియు వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు పూర్తి అప్రమత్తంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రజలు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. పుకార్లను నమ్మొద్దని, అలాగే వాటిని షేర్ చేయొద్దని సూచించింది. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక వనరుల నుంచి తెలుసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!









