యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!
- March 02, 2026
యూఏఈః పశ్చిమాసియా అగ్నిగుండగా మారింది. గల్ఫ్ దేశాలలో హై అలెర్ట్ కొనసాగుతోంది. జీసీసీ దేశాలు తమ గగనతలాలను పూర్తి మూసివేశాయి. మరోవైపు, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఏకంగా 165 బాలిస్టిక్ మిస్సైల్స్, 541 డ్రోన్లను ప్రయోగించింది. కాగా, ఇందులో 152 మిస్సైళ్లను గాలిలోనే అడ్డుకున్నామని, మరో 13 సముద్రంలో కూలిపోయాయని యూఏఈ ప్రకటించింది. అలాగే, 506 డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్నామని, కానీ 35 డ్రోన్లు మాత్రం రెసిడెన్షియల్ ప్రాంతాలను ఢీకొట్టాయని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు వివిధ దేశాలకు చెందిన మొత్తం ముగ్గురు ప్రవాసులు మరణించగా, 58 మంది ప్రవాసులు గాయపడ్డారని యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అయితే, మిస్సైల్స్ మరియు డ్రోన్ల నుండి వచ్చిన శిథిలాలు సివిలియన్ ఆస్తులకు నష్టాన్ని కలిగించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ నుండి జరుగుతున్న దాడులను యూఏఈ వైమానిక దళం మరియు వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు పూర్తి అప్రమత్తంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రజలు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. పుకార్లను నమ్మొద్దని, అలాగే వాటిని షేర్ చేయొద్దని సూచించింది. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక వనరుల నుంచి తెలుసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









