దుబాయ్ నుండి అబుదాబికి 25 నిమిషాల్లో చేరుకోవచ్చా?
- May 19, 2025
యూఏఈ: వచ్చే ఏడాది నుండి యూఏఈ వాసులు ఎతిహాద్ రైలులో ప్రయాణించవచ్చు. ఇటీవల అబుదాబి నుండి ఫుజైరాకు రైలులో ప్రయాణించిన మార్కెటర్, జాతీయ నిపుణుల ప్రోగ్రామ్ సభ్యురాలు సారా లుక్మాన్.. అబుదాబి నుండి దుబాయ్కు తన ప్రయాణానికి కేవలం 25 నిమిషాలు పట్టిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. సాధారణంగా ఈ ప్రయాణానికి దాదాపు 90 నిమిషాలు పడుతుంది. నేషనల్ ఎక్స్పర్ట్స్ ప్రోగ్రామ్ (NEP) ఐదవ మాడ్యూల్లో పాల్గొనడానికి అబుదాబి నుండి ఫుజైరాకు ప్రయాణించిన బృందంలో సారా ఒకరు.
స్పీడ్ స్క్రీన్, సౌకర్యవంతమైన సీట్లు
సారా పోస్ట్ చేసిన వీడియో రైలులో ప్రయాణం ఎలా ఉంటుందో చూపించింది. లేత బూడిద రంగుతో సౌకర్యవంతమైన సీట్లు నాలుగు వరుసల్లో ఉన్నాయి. బ్యాగులను పెట్టడానికి సీట్ల పైన లగేజ్ రాక్లు ఉన్నాయి. ఒక ప్యాసింజర్ రైలులో దాదాపు 400 మంది వ్యక్తులు కూర్చునే సదుపాయం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో బిజినెస్, ఎకానమీ క్లాస్ కంపార్ట్మెంట్లు ఉంటాయి. రైలు లోపల ఒక స్క్రీన్ ప్రయాణ మార్గాన్ని చూపెడుతుంది. అలాగే ఆహ్లదకరమైన ప్రదేశాల గుండా రైలువెళుతుందని, అవన్నీ ప్రకృతి రమణీయతను అందిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!









