దుబాయ్ నుండి అబుదాబికి 25 నిమిషాల్లో చేరుకోవచ్చా?
- May 19, 2025
యూఏఈ: వచ్చే ఏడాది నుండి యూఏఈ వాసులు ఎతిహాద్ రైలులో ప్రయాణించవచ్చు. ఇటీవల అబుదాబి నుండి ఫుజైరాకు రైలులో ప్రయాణించిన మార్కెటర్, జాతీయ నిపుణుల ప్రోగ్రామ్ సభ్యురాలు సారా లుక్మాన్.. అబుదాబి నుండి దుబాయ్కు తన ప్రయాణానికి కేవలం 25 నిమిషాలు పట్టిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. సాధారణంగా ఈ ప్రయాణానికి దాదాపు 90 నిమిషాలు పడుతుంది. నేషనల్ ఎక్స్పర్ట్స్ ప్రోగ్రామ్ (NEP) ఐదవ మాడ్యూల్లో పాల్గొనడానికి అబుదాబి నుండి ఫుజైరాకు ప్రయాణించిన బృందంలో సారా ఒకరు.
స్పీడ్ స్క్రీన్, సౌకర్యవంతమైన సీట్లు
సారా పోస్ట్ చేసిన వీడియో రైలులో ప్రయాణం ఎలా ఉంటుందో చూపించింది. లేత బూడిద రంగుతో సౌకర్యవంతమైన సీట్లు నాలుగు వరుసల్లో ఉన్నాయి. బ్యాగులను పెట్టడానికి సీట్ల పైన లగేజ్ రాక్లు ఉన్నాయి. ఒక ప్యాసింజర్ రైలులో దాదాపు 400 మంది వ్యక్తులు కూర్చునే సదుపాయం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో బిజినెస్, ఎకానమీ క్లాస్ కంపార్ట్మెంట్లు ఉంటాయి. రైలు లోపల ఒక స్క్రీన్ ప్రయాణ మార్గాన్ని చూపెడుతుంది. అలాగే ఆహ్లదకరమైన ప్రదేశాల గుండా రైలువెళుతుందని, అవన్నీ ప్రకృతి రమణీయతను అందిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







