కుల్లూరు అభయారణ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టిటిడి ఛైర్మన్

- May 22, 2025 , by Maagulf
కుల్లూరు అభయారణ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న టిటిడి ఛైర్మన్

తిరుమల: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులోని ఆరామ మారుతి నిలయ అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని టిటిడి ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు గురువారం దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు టిటిడి ఛైర్మన్ చేరుకోగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్ ఆహ్వానం మేరకు టిటిడి ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు అభయారణ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న టిటిడి ఛైర్మన్ కు జిల్లా కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ  కృష్ణ కాంత్, పలువురు స్థానిక నేతలు స్వాగతం పలికారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com