బహ్రెయిన్ డిప్యూటీ ప్రధాన మంత్రితో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం భేటీ..!!
- May 26, 2025
మనామా: బహ్రెయిన్ రాజ్యం ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, పార్లమెంటు సభ్యుడు బైజయంత్ పాండా నేతృత్వంలో భారత పార్లమెంట్ నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఘనేమ్ బిన్ ఫద్ల్ అల్ బుయైనైన్ సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా బహ్రెయిన్ - భారతదేశం మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను హైలైట్ చేశారు. బహ్రెయిన్ అభివృద్ధి ప్రయాణంలో భారతీయ సమాజం పోషించిన ముఖ్యమైన పాత్రను ఉప ప్రధాన మంత్రి ప్రశంసించారు. స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడం ప్రాథమికం అని తెలిపారు.
ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంలో బహ్రెయిన్ ప్రయత్నాలకు ఎంపీ బైజయంత్ పాండా ప్రశంసించారు. బహ్రెయిన్ నిరంతర అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం బహ్రెయిన్, భారతదేశం మధ్య బలమైన భాగస్వామ్యాన్ని, భవిష్యత్ సహకారం కోసం ఉమ్మడి దృక్పథాన్ని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









