బహ్రెయిన్ డిప్యూటీ ప్రధాన మంత్రితో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం భేటీ..!!
- May 26, 2025
మనామా: బహ్రెయిన్ రాజ్యం ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, పార్లమెంటు సభ్యుడు బైజయంత్ పాండా నేతృత్వంలో భారత పార్లమెంట్ నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఘనేమ్ బిన్ ఫద్ల్ అల్ బుయైనైన్ సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా బహ్రెయిన్ - భారతదేశం మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను హైలైట్ చేశారు. బహ్రెయిన్ అభివృద్ధి ప్రయాణంలో భారతీయ సమాజం పోషించిన ముఖ్యమైన పాత్రను ఉప ప్రధాన మంత్రి ప్రశంసించారు. స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడం ప్రాథమికం అని తెలిపారు.
ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంలో బహ్రెయిన్ ప్రయత్నాలకు ఎంపీ బైజయంత్ పాండా ప్రశంసించారు. బహ్రెయిన్ నిరంతర అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఆయన తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం బహ్రెయిన్, భారతదేశం మధ్య బలమైన భాగస్వామ్యాన్ని, భవిష్యత్ సహకారం కోసం ఉమ్మడి దృక్పథాన్ని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







