మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ బాసట..!!
- May 26, 2025
కువైట్: మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ అధికారికంగా KD 618,240 (సుమారు INR 17.31 కోట్లు) విలువైన గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను అందజేసింది. NBTC కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంబసీ, లులు ఎక్స్ఛేంజ్ గ్రూప్, NBTC మేనేజ్మెంట్ ప్రతినిధులు , ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కె. జి. అబ్రహం..మరణించిన 49 మంది ఉద్యోగుల చట్టపరమైన వారసులకు బీమా చెల్లింపులను అందజేశారు. బాధిత ఉద్యోగులకు 48 నెలల జీతానికి సమానమైన బీమా చెల్లింపును NBTC ఉద్యోగి సంక్షేమ పథకం కింద అందించారు. మిగిలిన ఉద్యోగుల కుటుంబాలను కలవడానికి NBTC మేనేజ్మెంట్ వచ్చే వారం భారతదేశానికి వెళ్లి అదనపు సహాయాన్ని అందిస్తుందని అబ్రహం ప్రకటించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









