మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ బాసట..!!
- May 26, 2025
కువైట్: మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ అధికారికంగా KD 618,240 (సుమారు INR 17.31 కోట్లు) విలువైన గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను అందజేసింది. NBTC కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంబసీ, లులు ఎక్స్ఛేంజ్ గ్రూప్, NBTC మేనేజ్మెంట్ ప్రతినిధులు , ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కె. జి. అబ్రహం..మరణించిన 49 మంది ఉద్యోగుల చట్టపరమైన వారసులకు బీమా చెల్లింపులను అందజేశారు. బాధిత ఉద్యోగులకు 48 నెలల జీతానికి సమానమైన బీమా చెల్లింపును NBTC ఉద్యోగి సంక్షేమ పథకం కింద అందించారు. మిగిలిన ఉద్యోగుల కుటుంబాలను కలవడానికి NBTC మేనేజ్మెంట్ వచ్చే వారం భారతదేశానికి వెళ్లి అదనపు సహాయాన్ని అందిస్తుందని అబ్రహం ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







