మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ బాసట..!!
- May 26, 2025
కువైట్: మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ అధికారికంగా KD 618,240 (సుమారు INR 17.31 కోట్లు) విలువైన గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను అందజేసింది. NBTC కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంబసీ, లులు ఎక్స్ఛేంజ్ గ్రూప్, NBTC మేనేజ్మెంట్ ప్రతినిధులు , ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కె. జి. అబ్రహం..మరణించిన 49 మంది ఉద్యోగుల చట్టపరమైన వారసులకు బీమా చెల్లింపులను అందజేశారు. బాధిత ఉద్యోగులకు 48 నెలల జీతానికి సమానమైన బీమా చెల్లింపును NBTC ఉద్యోగి సంక్షేమ పథకం కింద అందించారు. మిగిలిన ఉద్యోగుల కుటుంబాలను కలవడానికి NBTC మేనేజ్మెంట్ వచ్చే వారం భారతదేశానికి వెళ్లి అదనపు సహాయాన్ని అందిస్తుందని అబ్రహం ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..









