ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- February 11, 2026
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూషన్తో సమన్వయంతో లేబర్ ఫండ్ 'టంకీన్'.. ప్రభుత్వ సహాయ నిధులను కాజేసిన కేసులలో విజయం సాధించింది. మొదటి హై క్రిమినల్ కోర్టు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలు, BD5,000 మరియు BD50,000 మధ్య జరిమానా విధించింది. ఇతర నేరస్థులకు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డులను తప్పుడుగా చూపించడం, టామ్కీన్ వ్యవస్థ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ద్వారా సరికాని డేటాను సమర్పించడం , అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసినందుకు ఆరు నెలల జైలు శిక్ష మరియు BD1,000 - BD2,000 మధ్య జరిమానా విధించింది.
టామ్కీన్ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ నుండి ఫిర్యాదులు అందడంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. వేతన మద్దతు మరియు పరిహారం చెల్లింపులను పొందడానికి నిందితులు రెండు సంస్థల ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా తప్పుడు సమాచారం, ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించారని తేలింది. తద్వారా మొత్తం BD 88,000 కంటే ఎక్కువ మోసానికి పాల్పడ్డారని విచారణలో అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







