ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- February 11, 2026
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూషన్తో సమన్వయంతో లేబర్ ఫండ్ 'టంకీన్'.. ప్రభుత్వ సహాయ నిధులను కాజేసిన కేసులలో విజయం సాధించింది. మొదటి హై క్రిమినల్ కోర్టు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలు, BD5,000 మరియు BD50,000 మధ్య జరిమానా విధించింది. ఇతర నేరస్థులకు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డులను తప్పుడుగా చూపించడం, టామ్కీన్ వ్యవస్థ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ద్వారా సరికాని డేటాను సమర్పించడం , అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసినందుకు ఆరు నెలల జైలు శిక్ష మరియు BD1,000 - BD2,000 మధ్య జరిమానా విధించింది.
టామ్కీన్ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ నుండి ఫిర్యాదులు అందడంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. వేతన మద్దతు మరియు పరిహారం చెల్లింపులను పొందడానికి నిందితులు రెండు సంస్థల ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా తప్పుడు సమాచారం, ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించారని తేలింది. తద్వారా మొత్తం BD 88,000 కంటే ఎక్కువ మోసానికి పాల్పడ్డారని విచారణలో అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









