ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- February 11, 2026
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూషన్తో సమన్వయంతో లేబర్ ఫండ్ 'టంకీన్'.. ప్రభుత్వ సహాయ నిధులను కాజేసిన కేసులలో విజయం సాధించింది. మొదటి హై క్రిమినల్ కోర్టు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలు, BD5,000 మరియు BD50,000 మధ్య జరిమానా విధించింది. ఇతర నేరస్థులకు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డులను తప్పుడుగా చూపించడం, టామ్కీన్ వ్యవస్థ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ద్వారా సరికాని డేటాను సమర్పించడం , అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసినందుకు ఆరు నెలల జైలు శిక్ష మరియు BD1,000 - BD2,000 మధ్య జరిమానా విధించింది.
టామ్కీన్ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ నుండి ఫిర్యాదులు అందడంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. వేతన మద్దతు మరియు పరిహారం చెల్లింపులను పొందడానికి నిందితులు రెండు సంస్థల ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా తప్పుడు సమాచారం, ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించారని తేలింది. తద్వారా మొత్తం BD 88,000 కంటే ఎక్కువ మోసానికి పాల్పడ్డారని విచారణలో అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









