ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- February 11, 2026
రియాద్: ఖతార్ తో ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్ ఒప్పందానికి సౌదీ అరేబియా కేబినెట్ ఆమోదం తెలిపింది. రియాద్లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ అధ్యక్షత వహించారు. రియాద్ మరియు దోహాలను కలిపే 785 కి.మీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ రైలు మార్గంలో గంటకు 300 కి.మీ కంటే ఎక్కువ వేగంతో రైళ్లు పరుగులు తీయనున్నాయి. దీనితోపాటు అనేక అంశాలను కేబినెట్ సమీక్షించింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి కేబినెట్కు వివరించారు. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరియు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో క్రౌన్ ప్రిన్స్ అధికారిక పర్యటనల సందర్భంగా జరిపిన చర్చలను సమీక్షించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









