బహ్రెయిన్ లో జీరో టోలరెన్స్.. డ్రైవింగ్ నిర్లక్ష్యంపై ఇక కఠిన చర్యలు..!!
- June 01, 2025
మనామా: రహదారులపై వాహనదారుల భద్రతకు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గాయలు, లేదా మరణానికి దారితీసే ట్రాఫిక్ ఉల్లంఘనలకు చట్టపరమైన శిక్షలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నిర్లక్ష్య ప్రవర్తనను నియంత్రించే లక్ష్యంతో కొత్త చట్టాన్ని రూపొందించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ప్రజా భద్రత, సామాజిక శ్రేయస్సుకు నిరంతర ముప్పుగా భావించే వాటిని ఎదుర్కోవడానికి కఠినంగా వ్యవహారించాలని ఆదేశించారు.
రోడ్డు భద్రతకు ప్రాధాన్యత
రహదారుల భద్రత కేవలం నియంత్రణ సమస్య మాత్రమే కాదని, జాతీయ భద్రతకు మూలస్తంభమని చెప్పారు. అన్ని రహదారులు వాహనదారులకు సురక్షితమైన, స్థిరమైన ట్రాఫిక్ వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు. అదే సమయంలో సామాజిక భద్రత, శ్రేయస్సుకు మూలస్తంభంగా రహదారుల భద్రత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రతిపాదిత చట్టాలు వేగంగా నడపడం, నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేయడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి అధిక-ప్రమాదకర ప్రవర్తనలకు కఠిన శిక్షలు వేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







