అల్-రెగ్గైలోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం...ఐదుకు పెరిగిన మృతుల సంఖ్య..!!
- June 02, 2025
కువైట్: ఆదివారం తెల్లవారుజామున రెగ్గై ప్రాంతంలో జరిగిన ఒక అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగిందని అధికారులు తెలిపారు.మృతులందరూ సూడాన్ జాతీయులుగా తెలుస్తుంది. కాగా, ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. షువైఖ్ ఇండస్ట్రియల్, అర్దియా సెంటర్ల నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.మొదటగా ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి, త్వరగా అవి పక్క ప్రాంతాలకు వ్యాపించాయి.ఈ ప్రమాదంపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, భవనంలో ఎక్కువ మంది అద్దెదారులు ఆఫ్రికన్, ఆసియా జాతీయులు.మరోవైపు, జనరల్ ఫైర్ ఫోర్స్ భవనాలు, ఇతర సౌకర్యాల యజమానులు అన్ని భద్రత, అగ్ని నిరోధక నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







