అల్-రెగ్గైలోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం...ఐదుకు పెరిగిన మృతుల సంఖ్య..!!
- June 02, 2025
కువైట్: ఆదివారం తెల్లవారుజామున రెగ్గై ప్రాంతంలో జరిగిన ఒక అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగిందని అధికారులు తెలిపారు.మృతులందరూ సూడాన్ జాతీయులుగా తెలుస్తుంది. కాగా, ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. షువైఖ్ ఇండస్ట్రియల్, అర్దియా సెంటర్ల నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.మొదటగా ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి, త్వరగా అవి పక్క ప్రాంతాలకు వ్యాపించాయి.ఈ ప్రమాదంపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, భవనంలో ఎక్కువ మంది అద్దెదారులు ఆఫ్రికన్, ఆసియా జాతీయులు.మరోవైపు, జనరల్ ఫైర్ ఫోర్స్ భవనాలు, ఇతర సౌకర్యాల యజమానులు అన్ని భద్రత, అగ్ని నిరోధక నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







