కేదార్ నాథ్ యాత్రికులకు బిగ్ అలర్ట్..
- June 02, 2025
కేదార్ నాథ్ వెళ్లే యాత్రికులకు బిగ్ అలర్ట్. ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ వెళ్లే యాత్రికులు కేదార్ నాథ్ వెళ్లినప్పుడు అక్కడ నడవలేని వారు చాలా మంది గుర్రాలు, గాడిదల మీద వెళ్తుంటారు. స్థానిక వ్యాపారులకు ఇదో ఆదాయ వనరు. అయితే, డబ్బుల కోసం కనీసం ఆ మూగజీవాలకు రెస్ట్ కూడా ఇవ్వకుండా రాత్రి, పగలు వాటితో పనులు చేయిస్తుంటారు.
జనాలను, సంచులను మోయిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మూగజీవాల హింస మీద ఉత్తరాఖండ్ హైకోర్టులో ఓ పిటిషన్ నమోదైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేదార్ నాథ్ మార్గంలో రాత్రపూట గుర్రాలు, గాడిదల మీద ప్రయాణాన్ని నిషేధించింది.
హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఇక నుంచి వాటిని వినియోగించకూడదు.హైకోర్టు ఆదేశాలతో చార్ ధామ్ బోర్డు, స్థానిక జిల్లా అధికారులు ఆ మేరకు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని టూర్ ఆపరేటర్లు, స్థానిక గుర్రాలు, గాడిదల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







