కేదార్ నాథ్ యాత్రికులకు బిగ్ అలర్ట్..
- June 02, 2025
కేదార్ నాథ్ వెళ్లే యాత్రికులకు బిగ్ అలర్ట్. ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ వెళ్లే యాత్రికులు కేదార్ నాథ్ వెళ్లినప్పుడు అక్కడ నడవలేని వారు చాలా మంది గుర్రాలు, గాడిదల మీద వెళ్తుంటారు. స్థానిక వ్యాపారులకు ఇదో ఆదాయ వనరు. అయితే, డబ్బుల కోసం కనీసం ఆ మూగజీవాలకు రెస్ట్ కూడా ఇవ్వకుండా రాత్రి, పగలు వాటితో పనులు చేయిస్తుంటారు.
జనాలను, సంచులను మోయిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మూగజీవాల హింస మీద ఉత్తరాఖండ్ హైకోర్టులో ఓ పిటిషన్ నమోదైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేదార్ నాథ్ మార్గంలో రాత్రపూట గుర్రాలు, గాడిదల మీద ప్రయాణాన్ని నిషేధించింది.
హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఇక నుంచి వాటిని వినియోగించకూడదు.హైకోర్టు ఆదేశాలతో చార్ ధామ్ బోర్డు, స్థానిక జిల్లా అధికారులు ఆ మేరకు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని టూర్ ఆపరేటర్లు, స్థానిక గుర్రాలు, గాడిదల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









