ఎనిమిదేళ్ల తర్వాత చిత్ర పరిశ్రమలోకి తిరిగి వస్తున్నాగిరి..
- July 13, 2016
ఇదివరకు 'దిల్', 'ఆంధ్రావాలా', 'సై', 'నా అల్లుడు' వంటి చిత్రాలను నిర్మించిన గిరి (ఎ.ఎల్.ఎన. రెడ్డి) చాలా కాలం తర్వాత మళ్లీ చిత్ర నిర్మాణరంగంలోకి వచ్చారు. కొత్తగా వైనతేయ ప్రొడక్షన్స ప్రై. లిమిటెడ్ బేనర్ను నెలకొల్పారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ''ఎనిమిదేళ్ల తర్వాత చిత్ర పరిశ్రమలోకి తిరిగి వస్తున్నా. పరిశ్రమ దారుణంగా ఉంది. నిర్మాతల్ని బతకనిచ్చే పరిస్థితి లేదు. అయినా చూద్దామని ఇందులో దిగుతున్నా. ఇటీవల 'అర్ధనారి' సినిమాను విడుదల చేశాను. ఆ సినిమాకు పనిచేసిన టీమ్తో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నా. వచ్చే నెల నుంచి షూటింగ్ జరుపుతాం. ఎవరైనా మంచి కథతో, 30 శాతం పెట్టుబడితో వస్తే నేను మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు 70 శాతం పెట్టుబడితో చిత్రాన్ని నిర్మించి, నేనే విడుదల చేస్తాను'' అని చెప్పారు. 'అర్ధనారి' దర్శకుడు భానుశంకర్ మాట్లాడుతూ తమ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల కావడానికి గిరి సాయం చేశారన్నారు. రూ. 500 కోట్లను సినీ పరిశ్రమలో పెట్టుబడి పెడుతున్నామని మరో నిర్మాత సిరాజుద్దీన తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత యు. లావణ్యారెడ్డి, 'అర్ధనారి' హీరో హీరోయిన్లు అర్జున యజత, మౌర్యాని తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







