అహ్మదాబాద్ విమాన ప్రమాదం..రంజిత గోపకుమార్కు సలాలాలో సంతాపం..!!
- June 14, 2025
మస్కట్: అహ్మదాబాద్ నుండి గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విషాద ప్రమాదంలో మరణించిన 241 మంది బాధితులలో ఒకరైన రంజిత గోపకుమార్ మృతి చెందడంతో సలాలాలోని భారతీయ సమాజం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కేరళకు చెందిన 38 ఏళ్ల నర్సు రంజిత, మెరుగైన అవకాశాల కోసం యూకేకి వెళ్లడానికి ముందు దాదాపు దశాబ్దం పాటు సలాలాలో నివసించి పనిచేసింది. ఆమె తన స్వస్థలమైన కేరళలోని పతనంతిట్టలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తన ఉద్యోగాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఇటీవల భారతదేశానికి వచ్చింది. తిరిగి వెళ్తూ ప్రమాదంలో మరణించింది.
సలాలాలోని ఇండియన్ సోషల్ క్లబ్ (ISC) జనరల్ సెక్రటరీ డాక్టర్ సందీప్ ఓజా మాట్లాడుతూ.. రంజిత మరణం పట్ల కమ్యూనిటీ దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేసిందన్నారు. "రంజిత గోపకుమార్ సుల్తాన్ ఖబూస్ హాస్పిటల్లో సుమారు తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం సలాలాను విడిచిపెట్టారు. ఆ సమయంలో, ఆమె తల్లి మరియు ఇద్దరు పిల్లలు ఆమెతో ఇక్కడే ఉన్నారు. పిల్లలు సలాలాలోని ఇండియన్ స్కూల్లో చదువుకున్నారు. ఇది చాలా విషాదకరం. గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విషాదంలో తమ సన్నిహితులను కోల్పోయిన ఆమె కుటుంబానికి మరియు అన్ని కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము." అని పేర్కొన్నారు.
కేరళకు చెందిన మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా X లో తన సంతాపాన్ని పంచుకున్నారు. కోజెంచెరి బాధితుల్లో ఒకరిగా రంజితకు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







