బ్యాంకు వివరాల చోరీ..నకిలీ లింక్‌లను పంపుతున్న ముఠా అరెస్టు..!!

- June 15, 2025 , by Maagulf
బ్యాంకు వివరాల చోరీ..నకిలీ లింక్‌లను పంపుతున్న ముఠా అరెస్టు..!!

దుబాయ్: నకిలీ లింక్‌ల ద్వారా బాధితులను ఆకర్షించి, మోసం చేస్తున్న ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెస్టారెంట్లు, డెలివరీ కంపెనీలు వంటి ప్రసిద్ధ సంస్థల పేరుతో మోసాలకు ముఠా సభ్యులు పాల్పడుతున్నారని దుబాయ్ పోలీసులు తెలిపారు. విశ్వసనీయ కంపెనీల నుండి వచ్చినట్లు కనిపించే SMSలు, ఇమెయిల్‌లు, ఆన్‌లైన్ లింక్‌లను పంపడం ద్వారా సైబర్ నేరస్థులు బాధితుల నుంచి బ్యాంకు వివరాలను చోరీ చేస్తుంటారు. బాధితులను నమ్మించేందుకు స్కామర్లు ప్రముఖ సంస్థల పేర్లను ఉపయోగించుకున్నారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. “ఒక బాధితుడు లింక్‌పై క్లిక్ చేసి వారి బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, ముఠా నిధులను ఉపసంహరించుకోవడానికి ఆ డేటాను ఉపయోగిస్తుంది” అని వారు తెలిపారు.

దుబాయ్ పోలీస్ యాంటీ-ఫ్రాడ్ సెంటర్ నుండి ప్రత్యేక బృందాలు ముఠాను ట్రేస్ చేయడానికి పనిచేశాయి. ఈ మోసపూరిత సందేశాలను విశ్లేషించి, అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలను ట్రాక్ చేశాయి. ముఠా సభ్యులను గుర్తించి అరెస్టు చేసి వారివద్ద నుంచి ఎలక్ట్రానిక్ సాధనాలను స్వాధీనం చేసుకున్నారు.  ఆన్ లైన్ లో వచ్చే లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింక్‌లను సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో లేదా దుబాయ్ పోలీస్ యాప్,  eCrime ప్లాట్‌ఫారమ్‌లోని 'పోలీస్ ఐ' ఫీచర్ ద్వారా నివేదించాలని కోరారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com