మధ్యప్రాచ్యంలో శాంతికి ఒమన్ పిలుపు..!!
- June 15, 2025
మస్కట్: ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవుతున్నందున, కొనసాగుతున్న సంఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గౌరవప్రదమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఒమన్ సుల్తానేట్ నాయకత్వం వహిస్తోంది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో.. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని , హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ పరిణామాలపై వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ఉద్రిక్తలు తగ్గించాలని పిలుపునిచ్చారు.
అలాగే, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడానికి వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, పరస్పర ఆసక్తి ఉన్న అనేక విషయాలపై ఇరుపక్షాలు చర్చించాయి.
ఈ క్రమంలో ఇరాన్ నేడు(ఆదివారం-జూన్ 15) ఒమన్లోని మస్కట్లో జరగాల్సిన అమెరికాతో ఆరవ రౌండ్ అణు చర్చల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి ఉద్దేశించిన దౌత్య ప్రయత్నాలను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేసినట్లు ఒమన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









