మధ్యప్రాచ్యంలో శాంతికి ఒమన్ పిలుపు..!!
- June 15, 2025
మస్కట్: ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవుతున్నందున, కొనసాగుతున్న సంఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గౌరవప్రదమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఒమన్ సుల్తానేట్ నాయకత్వం వహిస్తోంది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో.. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని , హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ పరిణామాలపై వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ఉద్రిక్తలు తగ్గించాలని పిలుపునిచ్చారు.
అలాగే, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడానికి వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, పరస్పర ఆసక్తి ఉన్న అనేక విషయాలపై ఇరుపక్షాలు చర్చించాయి.
ఈ క్రమంలో ఇరాన్ నేడు(ఆదివారం-జూన్ 15) ఒమన్లోని మస్కట్లో జరగాల్సిన అమెరికాతో ఆరవ రౌండ్ అణు చర్చల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి ఉద్దేశించిన దౌత్య ప్రయత్నాలను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేసినట్లు ఒమన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







