మధ్యప్రాచ్యంలో శాంతికి ఒమన్ పిలుపు..!!
- June 15, 2025
మస్కట్: ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవుతున్నందున, కొనసాగుతున్న సంఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గౌరవప్రదమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఒమన్ సుల్తానేట్ నాయకత్వం వహిస్తోంది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో.. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని , హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ పరిణామాలపై వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ఉద్రిక్తలు తగ్గించాలని పిలుపునిచ్చారు.
అలాగే, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడానికి వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, పరస్పర ఆసక్తి ఉన్న అనేక విషయాలపై ఇరుపక్షాలు చర్చించాయి.
ఈ క్రమంలో ఇరాన్ నేడు(ఆదివారం-జూన్ 15) ఒమన్లోని మస్కట్లో జరగాల్సిన అమెరికాతో ఆరవ రౌండ్ అణు చర్చల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి ఉద్దేశించిన దౌత్య ప్రయత్నాలను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేసినట్లు ఒమన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..









