మధ్యప్రాచ్యంలో శాంతికి ఒమన్ పిలుపు..!!

- June 15, 2025 , by Maagulf
మధ్యప్రాచ్యంలో శాంతికి ఒమన్ పిలుపు..!!

మస్కట్: ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవుతున్నందున, కొనసాగుతున్న సంఘర్షణను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గౌరవప్రదమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా- ఇరాన్ మధ్య చర్చలకు ఒమన్ సుల్తానేట్ నాయకత్వం వహిస్తోంది. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో.. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని , హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ పరిణామాలపై వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ఉద్రిక్తలు తగ్గించాలని పిలుపునిచ్చారు.

 అలాగే, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడానికి వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, పరస్పర ఆసక్తి ఉన్న అనేక విషయాలపై ఇరుపక్షాలు చర్చించాయి.

 ఈ క్రమంలో ఇరాన్ నేడు(ఆదివారం-జూన్ 15) ఒమన్‌లోని మస్కట్‌లో జరగాల్సిన అమెరికాతో ఆరవ రౌండ్ అణు చర్చల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి ఉద్దేశించిన దౌత్య ప్రయత్నాలను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేసినట్లు ఒమన్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com