వేసవిలో ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్ బంపరాఫర్..!!
- June 16, 2025
యూఏఈ: 2025 వేసవిలో ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్ సౌకర్యవంతమైన పని గంటలను ప్రకటించింది. ఇది జూలై 1 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 12 వరకు కొనసాగుతుందని దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం (DGHR) పేర్కొంది. తాత్కాలిక సౌకర్యవంతమైన ఈ వర్క్ మోడల్ అధికారిక ఐదు రోజుల పని దినాలతో కలిపి అమలు చేయనున్నారు. ఉద్యోగులను రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ సోమవారం నుండి గురువారం వరకు ఎనిమిది గంటలు పని చేసి శుక్రవారం పూర్తి సెలవు దినంగా ఉండనుంది. రెండవ గ్రూప్ సోమవారం నుండి గురువారం వరకు ఏడు గంటలు, శుక్రవారం 4.5 గంటలు పని చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం, దుబాయ్ ప్రభుత్వం ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 30 వరకు 21 ప్రభుత్వ సంస్థలలో ఈ ప్రత్యేక చొరవను అమలు చేసింది. దుబాయ్లోని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రెండున్నర రోజుల వారాంతాన్ని (శుక్రవారం సగం రోజు, శనివారం,ఆదివారం) పొందుతారు.
యూఏఈ జూన్ 15 నుండి మధ్యాహ్నం వర్కర్ నిషేధాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇది సెప్టెంబర్ 15 వరకు మూడు నెలల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యక్ష ఎండలో పనిచేసే కార్మికులపై నిషేధాన్ని అమలు చేస్తుంది. ఈ నియమాన్ని ఉల్లంఘించిన కంపెనీలకు ఒక్కో కార్మికుడికి దిర్హామ్లు 5,000 జరిమానా విధించబడుతుంది. ఈ వేసవిలో దేశవ్యాప్తంగా డెలివరీ సర్వీస్ కార్మికుల కోసం 10,000 కంటే ఎక్కువ ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!