బహ్రెయిన్ లో మరో 26 కంపెనీలపై న్యాయచర్య
- July 14, 2015
బహ్రెయిన్ లో అమలులో ఉన్న ఆరుబయట విధుల నిషేధాన్ని అతిక్రమించిన మరో 26 కంపెనీలు న్యాయ విచారణను ఎదుర్కోనున్నాయి. కార్మిక శాఖమంత్రి, శ్రీ జమీల్ హమైదాన్ ఈ ఆదివారం వివిధ కంపెనీలను దర్శించి అక్కడ సమయనిబంధనలు సరిగా అమలౌతున్నదీ లేనిదీ పర్యవేక్షించారు. 9 రోజుల్లో మొత్తం 2461 సంస్థలను తనిఖీచేసిన కార్మికశాఖ అధికారులు 133 మంది శ్రామికులు నిషేధిత సమయాల్లో ఆరుబయట విధులు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ అండర్ సెక్రటరీ సాబా అల్ డోస్సరీ తెలియజేశారు. మనామా, సీఫ్ మరియు ఇశా పట్టణాలలోని కొతగా రిజిస్టార్ ఐన కoపెనీలనుoడి ఈ కేసులు నమోదయ్యాయని, అక్కడ చదువుకొనివారు, కొత్తగా చేరినవారికి ఈ నిబంధనలను గురించిన అవగాహన లేదన్నారు, ఈ నిబంధన మీరిన వారికి 500 నుండి 1000 ఒమానీ రియాల్ల జరిమాన ఉంటుందని, ఇది గృహ పనివారలకు కూడా వర్తిస్తుoదని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







