మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు
- July 14, 2015
పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విషాదంపై మీడియాతో మాట్లాడుతూకంటతడిపెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒకే ఘాట్కు ఎక్కువమంది రావడంతో తొక్కిసలాట జరిగిందన్న ఆయన, ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ దారుణ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.
తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పుష్కర ఘాట్ల వద్ద పోలీసుల సూచనల ప్రకారం భక్తులు వ్యవహరించాలన్నారు. అందరూ ఒకేసారి ఘాట్ల వద్దకు రావద్దని చంద్రబాబు సూచించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







