యూఏఈలో పెరుగుతున్న వీసా పొడిగింపు దరఖాస్తులు..!!
- June 19, 2025
యూఏఈ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈలో వీసా పొడిగింపు కోసం దరఖాస్తులు పెరుగుతున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జోర్డాన్, లెబనాన్ తోపాటు ఇతర మధ్యప్రాచ్య దేశాల నుండి ఈ దరఖాస్తులు అధికంగా ఉన్నాయని అన్నారు. వారి ప్రాంతంలో ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా తమ వీసా గడువును పొడిగించుకోవాలని అందరూ దరఖాస్తులు చేస్తున్నారు. ఈ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులలో చాలా మంది స్వల్పకాలిక సందర్శన వీసాపై వచ్చారు. కానీ ఇప్పుడు విమాన సర్వీసులు రద్దు లేదా స్వదేశానికి వెళ్లేందుకు భద్రతా సమస్యల కారణంగా మరింత కాలం యూఏఈలో ఉండాలని వారు కోరుకుంటున్నట్లు ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ భాగస్వామి భరత్ ఐదాసాని తెలిపారు. వీసా పునరుద్ధరణలు, పొడిగింపుల గురించి తన ఏజెన్సీకి రోజువారీగా విచారణలు అందుతున్నాయని ఐదాసాని అన్నారు.
వైజ్ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ.. జోర్డాన్, లెబనాన్, ఇరాన్ వంటి దేశాల నుండి యూఏఈ వచ్చిన పర్యాటకులు.. తమ వేసవి సెలవులను మరికొన్ని రోజులపాటు పొడిగించుకుంటున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







