యూఏఈలో పెరుగుతున్న వీసా పొడిగింపు దరఖాస్తులు..!!
- June 19, 2025
యూఏఈ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈలో వీసా పొడిగింపు కోసం దరఖాస్తులు పెరుగుతున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జోర్డాన్, లెబనాన్ తోపాటు ఇతర మధ్యప్రాచ్య దేశాల నుండి ఈ దరఖాస్తులు అధికంగా ఉన్నాయని అన్నారు. వారి ప్రాంతంలో ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా తమ వీసా గడువును పొడిగించుకోవాలని అందరూ దరఖాస్తులు చేస్తున్నారు. ఈ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులలో చాలా మంది స్వల్పకాలిక సందర్శన వీసాపై వచ్చారు. కానీ ఇప్పుడు విమాన సర్వీసులు రద్దు లేదా స్వదేశానికి వెళ్లేందుకు భద్రతా సమస్యల కారణంగా మరింత కాలం యూఏఈలో ఉండాలని వారు కోరుకుంటున్నట్లు ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ భాగస్వామి భరత్ ఐదాసాని తెలిపారు. వీసా పునరుద్ధరణలు, పొడిగింపుల గురించి తన ఏజెన్సీకి రోజువారీగా విచారణలు అందుతున్నాయని ఐదాసాని అన్నారు.
వైజ్ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ.. జోర్డాన్, లెబనాన్, ఇరాన్ వంటి దేశాల నుండి యూఏఈ వచ్చిన పర్యాటకులు.. తమ వేసవి సెలవులను మరికొన్ని రోజులపాటు పొడిగించుకుంటున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









