యూఏఈలో పెరుగుతున్న వీసా పొడిగింపు దరఖాస్తులు..!!
- June 19, 2025
యూఏఈ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈలో వీసా పొడిగింపు కోసం దరఖాస్తులు పెరుగుతున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జోర్డాన్, లెబనాన్ తోపాటు ఇతర మధ్యప్రాచ్య దేశాల నుండి ఈ దరఖాస్తులు అధికంగా ఉన్నాయని అన్నారు. వారి ప్రాంతంలో ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా తమ వీసా గడువును పొడిగించుకోవాలని అందరూ దరఖాస్తులు చేస్తున్నారు. ఈ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులలో చాలా మంది స్వల్పకాలిక సందర్శన వీసాపై వచ్చారు. కానీ ఇప్పుడు విమాన సర్వీసులు రద్దు లేదా స్వదేశానికి వెళ్లేందుకు భద్రతా సమస్యల కారణంగా మరింత కాలం యూఏఈలో ఉండాలని వారు కోరుకుంటున్నట్లు ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ భాగస్వామి భరత్ ఐదాసాని తెలిపారు. వీసా పునరుద్ధరణలు, పొడిగింపుల గురించి తన ఏజెన్సీకి రోజువారీగా విచారణలు అందుతున్నాయని ఐదాసాని అన్నారు.
వైజ్ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ.. జోర్డాన్, లెబనాన్, ఇరాన్ వంటి దేశాల నుండి యూఏఈ వచ్చిన పర్యాటకులు.. తమ వేసవి సెలవులను మరికొన్ని రోజులపాటు పొడిగించుకుంటున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్