యూఏఈలో పెరుగుతున్న వీసా పొడిగింపు దరఖాస్తులు..!!
- June 19, 2025
యూఏఈ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈలో వీసా పొడిగింపు కోసం దరఖాస్తులు పెరుగుతున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ముఖ్యంగా జోర్డాన్, లెబనాన్ తోపాటు ఇతర మధ్యప్రాచ్య దేశాల నుండి ఈ దరఖాస్తులు అధికంగా ఉన్నాయని అన్నారు. వారి ప్రాంతంలో ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా తమ వీసా గడువును పొడిగించుకోవాలని అందరూ దరఖాస్తులు చేస్తున్నారు. ఈ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులలో చాలా మంది స్వల్పకాలిక సందర్శన వీసాపై వచ్చారు. కానీ ఇప్పుడు విమాన సర్వీసులు రద్దు లేదా స్వదేశానికి వెళ్లేందుకు భద్రతా సమస్యల కారణంగా మరింత కాలం యూఏఈలో ఉండాలని వారు కోరుకుంటున్నట్లు ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ భాగస్వామి భరత్ ఐదాసాని తెలిపారు. వీసా పునరుద్ధరణలు, పొడిగింపుల గురించి తన ఏజెన్సీకి రోజువారీగా విచారణలు అందుతున్నాయని ఐదాసాని అన్నారు.
వైజ్ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ థెకేపురథ్వలప్పిల్ మాట్లాడుతూ.. జోర్డాన్, లెబనాన్, ఇరాన్ వంటి దేశాల నుండి యూఏఈ వచ్చిన పర్యాటకులు.. తమ వేసవి సెలవులను మరికొన్ని రోజులపాటు పొడిగించుకుంటున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







