మెట్రో ఫేజ్-2 కు అనుమతులు ఇవ్వండి..కేంద్ర మంత్రికి సీఎం రేవంత్
- June 19, 2025
న్యూ ఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-II)కు అవసరమైన అనుమతులు తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరణ అత్యవసరమని ఆయన వివరించారు.
ఈరోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ను ఆయన నివాసంలో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 76.4 కి.మీ పొడవైన మెట్రో ఫేజ్-II ప్రాజెక్టును రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించామని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి దీనిని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
సుస్థిర అభివృద్ధికి మెట్రో కీలకం
మెట్రో ఫేజ్-II అమలుతో నగర రవాణా వ్యవస్థ మరింత వేగవంతం అవుతుందని, రహదారి ట్రాఫిక్ తగ్గి ప్రజలకు అనుకూలమైన ప్రయాణ అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు.ఇది నగర సుస్థిరాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు అవసరమైన సవరణలతో ప్రాజెక్టు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) ఇప్పటికే సమర్పించినట్టు సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రాజెక్టు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఇతర విభాగాలు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి,రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..