దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు..
- June 20, 2025
హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతల ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగా ఇప్పుడు మూడో విడత ప్రవేశాలు జరుగుతున్నాయి. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ల గడువు కూడా నిన్నటి (జూన్ 19)తో పూర్తయింది. ఈ నేపథ్యంలోనే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడవ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గడువును పొడిగిస్తూ ప్రకటన విడుదల చేశారు.
జూన్ 25 వరకు పొడిగింపు:
దోస్త్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గడువును జూన్ 25 తేదీ వరకు పొడిగించారు. ఈ తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరికి జూన్ 28వ తేదీన సీట్లను కేటాయింపు జరుగుతుంది. అనంతరం జూన్ 28 నుంచి 30 తేదీలలో ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి, జూన్ 28 నుంచి జూలై 1వ తేదీల మధ్య అలాట్ అయిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. కాలేజీల్లో రిపోర్టింగ్ చేయకపోతే సీటు రద్దవుతుంది. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన వెంటనే.. జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ కు సంబందించిన తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు విడతల ప్రవేశాలు పూర్తయ్యాక కూడా సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంటుంది.
దోస్త్ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకొండి:
- దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో Candidate Pre-Registrationపై క్లిక్ చేయాలి.
- ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- చివరల్లో Aadhaar Authentication ప్రక్రియ పూర్తి చేయాలి.
- తర్వాత దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
- దోస్త్ ఐడీతో లాగిన్ అవ్వాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్ణయించిన ఫీజును చెల్లించాలి
- తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
- తర్వాత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి.
- ఇంటర్ లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







