మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు.. పుతిన్కు బహ్రెయిన్ ప్రెసిడెంట్ ధన్యవాదాలు..!!
- June 21, 2025
మనామా: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తోన్న కృషికి బహ్రెయిన్ జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ గార్డ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హిస్ హైనెస్ షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ధన్యవాదాలు తెలిపారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం (SPIEF) సందర్భంగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈమేరకు కృతజ్ఞతలు తెలిపారు.రష్యా - బహ్రెయిన్ మధ్య శాశ్వత సంబంధాలను ప్రశంసించారు.
అధ్యక్షుడు పుతిన్.. ప్రిన్స్ నాజర్, అతనితో పాటు వచ్చిన బహ్రెయిన్ ప్రతినిధి బృందాన్ని హృదయపూర్వకంగా స్వాగతించారు. "దురదృష్టవశాత్తు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మా సమావేశం జరుగుతోంది. అక్కడి పరిణామాలను మనమందరం ఆందోళనతో గమనిస్తున్నాము." అని పేర్కొన్నారు. జాతీయ భద్రతలో విస్తృతమైన బాధ్యతలు ఉన్నప్పటికీ, షేక్ నాజర్ ఉనికి రష్యాతో తన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి బహ్రెయిన్ బలమైన నిబద్ధతను ప్రదర్శిస్తుందని పుతిన్ అన్నారు. “ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో, గత సంవత్సరంతో పోలిస్తే, పరస్పర వాణిజ్యంలో 15% వృద్ధిని చూశాము” అని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాలు ఆర్థిక, సాంస్కృతిక మరియు మానవతా రంగాలలో దగ్గరగా పనిచేస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









