బుర్జ్ ఖలీఫా-దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ ప్రయాణికులకు శుభవార్త..!!
- June 23, 2025
యూఏఈ: బుర్జ్ ఖలీఫా-దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ ప్రయాణికులకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) శుభవార్త తెలిపింది. ప్రయాణీకుల సామర్థ్యాన్ని 65 శాతం పెంచడానికి బుర్జ్ ఖలీఫా-దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ను విస్తరించనున్నారు. విస్తరణ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత స్టేషన్ రోజుకు 220,000 మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుందని ప్రకటించారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు, ప్రభుత్వ సెలవులు, జాతీయ కార్యక్రమాలు, సెలవు దినాలలో పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్ను తీర్చడానికి ఎమ్మార్ ప్రాపర్టీస్తో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ఆర్టీఏ తెలిపింది.
విస్తరణలో భాగంగా స్టేషన్ యొక్క విస్తీర్ణాన్ని 6,700 నుండి 8,500 చదరపు మీటర్లకు పెంచనున్నారు. దాంతో స్టేషన్ సామర్థ్యాన్ని గంటకు 7,250 నుండి 12,320 మంది ప్రయాణికులకు పెంచుతుందని RTA డైరెక్టర్ జనరల్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మతార్ అల్ తాయర్ తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో స్టేషన్ సగటున వార్షిక రైడర్షిప్ వృద్ధిని 7.5 శాతం నమోదు చేసిందన్నారు.
ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఎంట్రన్స్ , పెడస్టేరియన్స్ బ్రిడ్జిలు, కాన్కోర్స్ మరియు ప్లాట్ఫారమ్ ప్రాంతాలను విస్తరిస్తారు. అలాగే, అదనపు ఎస్కలేటర్లు, ఎలివేటర్లను అధునీకికరించనున్నారు. అదే సమయంలో ఆదాయాన్ని పెంచడానికి ఫేర్ గేట్ల సంఖ్యను పెంచడంతోపాటు వాణిజ్య స్థలాలను విస్తరించనున్నారు.
2010లో ప్రారంభించినప్పటి నుండి, బుర్జ్ ఖలీఫా-దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ స్థిరమైన వృద్ధిని సాధించింది. ప్రయాణీకుల సంఖ్య 2013లో 6.13 మిలియన్ల నుండి 2016లో 7.25 మిలియన్లకు పెరిగింది. 2022 -2024 మధ్య ఈ సంఖ్య దాదాపు రెండు మిలియన్లకు పెరిగింది. గత సంవత్సరం 10.57 మిలియన్లకు పైగా ప్రయాణికులు మెట్రోను వినియోగించుకున్నారు. అంటే ప్రతిరోజూ స్టేషన్లో దాదాపు 58,000 మంది మెట్రో ఎక్కి దిగుతున్నారు.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు