హిస్టరీ క్రియేట్ చేసిన స్మృతి మంధాన..
- June 28, 2025
భారత మహిళా స్టార్ స్టేయర్ స్మృతి మంధాన తన కెరీర్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్తో ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి T20లో తన తొలి టీ20 అంతర్జాతీయ శతకాన్ని బాదిన మంధాన, మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది.
మంధాన 51 బంతుల్లోనే శతకం సాధించగా, మొత్తం 62 బంతుల్లో 112 పరుగులు (15 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్ భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె, ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. పవర్ప్లే నుంచే అటాకింగ్ మూడ్లోకి వెళ్లిన మంధాన, బౌండరీల వర్షం కురిపించి ప్రత్యర్థులపై ఒత్తిడి తలపెట్టింది.
అంతేకాకుండా, రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గాయం కారణంగా మ్యాచ్కు దూరమైన నేపథ్యంలో… మంధానకు తాత్కాలిక నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. ఆమె స్టాండ్-ఇన్ కెప్టెన్గా కూడా జట్టును అద్భుతంగా నడిపించింది. ఈ మ్యాచ్లో, భారత్ జట్టు రెండవ అత్యధిక టీ20I స్కోరు 210/5ని నమోదు చేసింది.
ఈ ఇన్నింగ్స్ తో మంధాన తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకోవడమే కాకుండా భారత మహిళా క్రికెట్ కు స్ఫూర్తిదాయక నాయకురాలిగా నిలిచింది. భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఆమె పేరు ఇప్పుడు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









