అల్ బర్షాలో 656 స్కూటర్లను సీజ్ చేసిన దుబాయ్ పోలీసులు..!!
- June 29, 2025
దుబాయ్: రైడర్లు చేసిన వివిధ ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనల కారణంగా గత సంవత్సరం అల్ బర్షా ప్రాంతంలోనే దుబాయ్ పోలీసులు మొత్తం 656 స్కూటర్లను జప్తు చేసినట్లు అధికారులు ప్రకటించారు. జనరల్ డిపార్ట్మెంట్లు, పోలీస్ స్టేషన్ల కోసం వార్షిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా క్రిమినల్ అఫైర్స్ డిప్యూటీ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ హరిబ్ మొహమ్మద్ అల్ షంసీ అల్ బర్షా పోలీస్ స్టేషన్లో తనిఖీ సందర్శన వివరాలను తెలియజేశారు. ఈ ప్రాంతంలో భద్రతా కవరేజీని, అలాగే సగటు అత్యవసర ప్రతిస్పందన సమయం, ట్రాఫిక్ ప్రమాద మరణాలు, నేరాల రేటును అడిగి తెలుసుకున్నారుఈ తనిఖీలో రిపోర్టింగ్ ప్రదేశాలలో డ్యూటీలో ఉన్న అధికారులు 100 శాతం హాజరు రేటును సాధించారని, విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకున్నారని అభినందించారు. గత సంవత్సరం 656 స్కూటర్లు రైడర్లు చేసిన ట్రాఫిక్ చట్ట ఉల్లంఘనల కారణంగా జప్తు చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఏప్రిల్లో సైక్లిస్టులు, ఇ-స్కూటర్ రైడర్ల ఉల్లంఘనలను పర్యవేక్షించడంపై దృష్టి సారించిన ప్రత్యేక యూనిట్ను ప్రారంభించినట్లు దుబాయ్ ప్రకటించింది. రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA), దుబాయ్ పోలీసుల సహకారంతో ప్రారంభించబడిన ఈ యూనిట్.. ట్రాఫిక్ నిబంధనలను పాటించడాన్ని పర్యవేక్షించనుంది.
గత సంవత్సరం దుబాయ్లో సైకిళ్లు, ఇ-స్కూటర్లకు సంబంధించి 254 ప్రమాదాలు జరిగాయని, ఫలితంగా 10 మంది మరణించారని, 259 మంది గాయపడ్డారు.మరోవైపు, లైసెన్స్ లేని టీనేజర్లు ఎలక్ట్రిక్ బైక్లు, ఇ-స్కూటర్లను నిర్లక్ష్యంగా నడుపుతున్నారనే సమస్య యూఏఈ నివాసితుల ప్రధాన ఆందోళనలలో ఒకటిగా ఉంది. వీరు తరచుగా ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తూ.. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా ఉంటున్నారని నివాసితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









