దుబాయ్ లో కార్మికులకు ఉచితంగా చల్లని నీరు, ఐస్ క్రీమ్స్ పంపిణీ..!!
- June 29, 2025
యూఏఈ: దుబాయ్ సౌత్లోని అజీజీ వెనిస్లో వందలాది మంది నిర్మాణ కార్మికులకు ప్రతిరోజు చల్లని నీరు, ఐస్ క్రీం, జ్యూసులను అల్ ఫ్రీజ్ ఫ్రిజ్ అనే స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేస్తున్నది. ఇది సమ్మర్ హీట్ వేవ్స్ నుంచి కార్మికులకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది.వేసవిలో ఎమిరేట్ అంతటా కార్మికులకు రెండు మిలియన్ల రిఫ్రెష్మెంట్లను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ చొరవకు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ మద్దతు ఇస్తుందన్నారు. సుకియా , యూఏఈ ఫుడ్ బ్యాంక్ సహకారంతో ఫెర్జాన్ దుబాయ్ ప్రారంభించింది.
బంగ్లాదేశ్కు చెందిన స్టీల్ ఫిక్సర్ మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ.. “నేను ఆరు సంవత్సరాలుగా దుబాయ్లో పనిచేస్తున్నాను. సమ్మర్ లో చల్లని జ్యూసులు, ఐస్ క్రీములు ఒక వరంలా అనిపిస్తుంది. ఇది మాకు ముందుకు సాగడానికి శక్తిని ఇస్తుంది.” అని అన్నారు. ఈ సమ్మర్ లో ఇలాంటి చొరవలు కార్మికులకు మేలు చేస్తుందని, అలసిపోయిన తమకు ఇది సాంత్వన చేకూర్చుతుందని నేపాల్కు చెందిన లాల్ బహదూర్ అన్నారు.
ఆగస్టు 23 వరకు జరిగే అల్ ఫ్రీజ్ ఫ్రిజ్ ప్రచారం దుబాయ్లోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతోందని ప్రకటించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









