దుబాయ్ లో కార్మికులకు ఉచితంగా చల్లని నీరు, ఐస్ క్రీమ్స్ పంపిణీ..!!
- June 29, 2025
యూఏఈ: దుబాయ్ సౌత్లోని అజీజీ వెనిస్లో వందలాది మంది నిర్మాణ కార్మికులకు ప్రతిరోజు చల్లని నీరు, ఐస్ క్రీం, జ్యూసులను అల్ ఫ్రీజ్ ఫ్రిజ్ అనే స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేస్తున్నది. ఇది సమ్మర్ హీట్ వేవ్స్ నుంచి కార్మికులకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది.వేసవిలో ఎమిరేట్ అంతటా కార్మికులకు రెండు మిలియన్ల రిఫ్రెష్మెంట్లను పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ చొరవకు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ మద్దతు ఇస్తుందన్నారు. సుకియా , యూఏఈ ఫుడ్ బ్యాంక్ సహకారంతో ఫెర్జాన్ దుబాయ్ ప్రారంభించింది.
బంగ్లాదేశ్కు చెందిన స్టీల్ ఫిక్సర్ మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ.. “నేను ఆరు సంవత్సరాలుగా దుబాయ్లో పనిచేస్తున్నాను. సమ్మర్ లో చల్లని జ్యూసులు, ఐస్ క్రీములు ఒక వరంలా అనిపిస్తుంది. ఇది మాకు ముందుకు సాగడానికి శక్తిని ఇస్తుంది.” అని అన్నారు. ఈ సమ్మర్ లో ఇలాంటి చొరవలు కార్మికులకు మేలు చేస్తుందని, అలసిపోయిన తమకు ఇది సాంత్వన చేకూర్చుతుందని నేపాల్కు చెందిన లాల్ బహదూర్ అన్నారు.
ఆగస్టు 23 వరకు జరిగే అల్ ఫ్రీజ్ ఫ్రిజ్ ప్రచారం దుబాయ్లోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతోందని ప్రకటించారు.
తాజా వార్తలు
- Dubai Media Council announces return of Dubai International Film Festival
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ







