తెలంగాణ: ఇక పై ప్రభుత్వ పాఠశాలల్లో సంగీతం పాఠాలు
- June 29, 2025
హైదరాబాద్: తెలంగాణ విద్యా రంగంలో ఓ సానుకూలమైన మార్పు చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సంగీతాన్ని కూడా అభ్యసించే అవకాశాన్ని పొందనున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద రాష్ట్రంలోని పలు పాఠశాలలు కొత్త దిశలో పయనించనున్నాయి.
ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 794 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యవిషయాలతో పాటు సంగీత విద్యను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
దీనిలో భాగంగా ఒక్కో పాఠశాలకు ఐదేళ్లలో రూ.కోటి నుంచి రూ.2.25 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలలకు ల్యాప్టాప్లు, క్రీడా సామగ్రి అందజేశారు. తాజాగా 270 హైస్కూల్లకు సంగీత పాఠాల నిమిత్తం వాయిద్య పరికరాలను అందజేశారు. ఈ పరికరాలను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీజీటీఎస్) టెండర్ల ద్వారా సరఫరా చేసింది.
అయితే సంగీత పాఠాలు నేర్పే టీచర్ల నియామకంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పాఠశాలకో టీచర్ను నియమించడానికి నెలకు రూ.10 వేల చొప్పున 6 నెలలకు రూ.60 వేలు కేటాయించారు. అయితే వాయిద్యాలను నేర్పించడానికి ప్రత్యేక టీచర్లను నియమించాల్సి ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించి, కార్యాచరణ రూపొందించేలా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- Dubai Media Council announces return of Dubai International Film Festival
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ







