సెప్టెంబర్లో మాన్సూన్ ఫెస్టివల్
- July 14, 2016
కేరళ నుంచి మాన్సూన్ ఫెస్టివల్ని నిర్వహించేందుకు సెప్టెంబర్ నెల వేదిక కానుంది. 2005లో కేరళలో ప్రారంభమైన మాన్సూన్ సినీ ఫెస్టివల్ ఇప్పుడు దుబాయ్, అబుదాబీ మరియు షార్జాలకు విస్తరించింది. పాన్ అరబ్ టూర్లో భాగంగా కేరళ ప్రభుత్వ సహకారంతో ఈ ఫెస్టివల్స్ని నిర్వహిస్తున్నారు. గల్ఫ్ రీజియన్ కోసం తొలిసారిగా మాన్సూన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. 'కోచి మెట్రో షార్ట్ ఫిలింస్ యూఏఈ' పేరుతో నిర్వహించనున్న ఈ ఈవెంట్లో 50 షార్ట్ ఫలింస్ని ప్రదర్శిస్తారు. సినిమా ద్వారా సమాజానికి సంబంధించి అనేక ముఖ్యమైన అంశాల్ని ప్రస్తావించి, ప్రజల్ని జాగృతం చేసే అవకాశముందని ఫెస్టివల్ డైరెక్టర్ రవీందర్ చెప్పారు. యూఏఈని బేస్ చేసుకుని రవీందర్ ఓ వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా షార్ట్ ఫిలింస్నీ, మూవీ మేకింగ్ కాన్సెప్ట్లనీ షేర్ చేస్తున్నారు. మాన్సూన్ సినీ ఫెస్టివల్లో అరేబియన్ ఫ్రేమ్స్ అనే షార్ట్ పిలిం ఫెస్టివల్ ప్రత్యేకంగా దుబాయ్, అబుదాబీకి చెందినవారి కోసం కేరళలోని కోచి, కోజికోడ్, తిరువనంతపురంలోనూ నిర్వహించనున్నట్లు తెలిపారాయన. గల్ఫ్ రీజియన్, కేరళీయులకు రెండో స్వస్థలంగా వర్ధిల్లుతోందనీ, అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రవీంద్రన్.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







