అక్టోబరులో షిరిడీ ఎయిర్పోర్టు ప్రారంభం..
- July 14, 2016
మహారాష్ట్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిరిడీలో నిర్మిస్తున్న ఎయిర్పోర్టును వచ్చే అక్టోబర్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ త్వరలో ఆహ్వానిస్తారని మహారాష్ట్ర ఎయిర్పోర్టు డెవలప్మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వాస్ పాటిల్ తెలిపారు.
బుధవారం ఎయిర్పోర్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించిన అనంతరం ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. 900 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్టుకు ఇప్పటి వరకు రూ.225 కోట్లను ఖర్చు చేశామని, ఇంకా వంద కోట్ల పనులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. యూకే, సింగపూర్, దుబాయ్లతో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చే యాత్రికులు దిల్లీ, ముంబయి విమానాశ్రయాల ద్వారా నేరుగా షిరిడీ చేరుకోవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









