సహకారం బలోపేతం..భారత్ తో GCC రాయబారులు భేటీ..!!

- July 03, 2025 , by Maagulf
సహకారం బలోపేతం..భారత్ తో GCC రాయబారులు భేటీ..!!

కువైట్: భారతదేశంతో సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలను చర్చించడానికి న్యూఢిల్లీలోని గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల రాయబారులు కువైట్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ ప్రస్తుత అధిపతిగా కువైట్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సమీక్షించారు. వివిధ రంగాలలో GCC- భారత సంబంధాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి మార్గాలను చర్చించినట్లు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఖతార్‌పై ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలు, మంచి నేబర్ హుడ్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు అభివర్ణించారు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు  ముఖ్యమైన జలమార్గమైన హార్ముజ్ జలసంధి మూసివేత బెదిరింపులపై GCC రాయబారులు ఆందోళన వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com