మంగళగిరి ఎయిమ్స్లో ర్యాగింగ్ పై కఠిన చర్యలు
- July 05, 2025
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్లపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదుతో యాజమాన్యం తక్షణమే విచారణ ప్రారంభించింది.అంతర్గత విచారణలో ర్యాగింగ్ ఆరోపణలు నిజమని తేలింది.ఈ నేపథ్యంలో 13 మంది సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. హాస్టల్ నుంచి వారిని బహిష్కరించడంతో పాటు, ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా విధించారు. బాధిత జూనియర్ల నుంచి క్షమాపణలు కోరించి, రాతపూర్వక లేఖలు తీసుకున్నట్లు డాక్టర్ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
పోలీసులకు సమాచారం, మరింత విచారణ వేళ
ర్యాగింగ్ ఘటన జరిగిన జూన్ 22ననే పోలీసులకు సమాచారం అందించినట్టు ఆయన వెల్లడించారు. తమ అంతర్గత విచారణ పూర్తయిందని, ఇప్పుడు పోలీసుల విచారణ మిగిలిందన్నారు. పోలీసుల దర్యాప్తు ఆలస్యం అయినా తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.ఈ అంశంపై మీడియా సంస్థలతో మాట్లాడిన వంశీకృష్ణారెడ్డి, బాధితులు మరియు నిందితుల పేర్లను బయటపెట్టకుండా నిగ్రహంగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, సంస్థ పేరు ఖ్యాతిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
ర్యాగింగ్ పై ఎయిమ్స్ స్పష్టమైన తీర్పు
వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించేందుకు ఎటువంటి రాయితీ లేకుండా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ర్యాగింగ్ విషయంలో తాము సమర్ధంగా స్పందించామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!







