కళారాజ్ సోషల్ మీడియా మరియు సినిమా అవార్డ్స్–2025
- July 06, 2025
హైదరాబాద్: సోషల్ మీడియా మరియు సినీ ప్రపంచాన్ని గౌరవించే ఉద్దేశంతో కళారాజ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా సోషల్ మీడియా & సినిమా అవార్డ్స్–2025 వేడుక హైదరాబాద్ లో ఈ నెల20న T-Hub లో నిర్వహించబడుతోందని కళారాజ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ మర్రి తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవ్వనున్నారు.
ఈ అవార్డ్స్ ప్రధానంగా రెండు విభాగాల్లో బడతాయి—సినిమా విభాగం,సోషల్ మీడియా విభాగం
సినిమా విభాగం:
ఈ విభాగంలో ఉత్తమ నటుడు, ఉత్తమ నట్రి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నేపథ్య సంగీతం వంటి అనేక విభాగాల్లో అవార్డులు ప్రకటించబడతాయి. వినూత్నమైన కథలు, కొత్త టాలెంట్కు ప్రోత్సాహంగా ఈ అవార్డులు నిలుస్తాయి.
సోషల్ మీడియా విభాగం:
ఈ విభాగం సోషల్ మీడియా వేదికల్లో ప్రభావాన్ని చూపిన ఇన్ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు గౌరవంగా నిలుస్తాయి.యువతలో స్పూర్తిగా నిలుస్తున్న టాలెంట్ను గుర్తించి అవార్డులతో సత్కరించడం కళారాజ్ సంస్థ ప్రధాన లక్ష్యం.
ముఖ్య అతిధులు:
ఈ వేడుకకు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా స్టార్లు, మరియు వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరవ్వనున్నారు.
కళారాజ్ సంస్థ దృష్టికోణం:
కళ, సాంకేతికత మరియు సామాజిక ప్రభావానికి వేదికగా నిలవడం–ఇదే కళారాజ్ లక్ష్యం. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యుగంలో ప్రతిభను గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ అవార్డ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ వేడుకతో కళారాజ్ మరింత మంది టాలెంట్లకు ప్రేరణగా నిలుస్తూ, సినీ మరియు డిజిటల్ ప్రపంచానికి మధుర జ్ఞాపకాల్ని అందిస్తుంది.ఈ వేడుకకు మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









