కళారాజ్ సోషల్ మీడియా మరియు సినిమా అవార్డ్స్–2025
- July 06, 2025
హైదరాబాద్: సోషల్ మీడియా మరియు సినీ ప్రపంచాన్ని గౌరవించే ఉద్దేశంతో కళారాజ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా సోషల్ మీడియా & సినిమా అవార్డ్స్–2025 వేడుక హైదరాబాద్ లో ఈ నెల20న T-Hub లో నిర్వహించబడుతోందని కళారాజ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ మర్రి తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవ్వనున్నారు.
ఈ అవార్డ్స్ ప్రధానంగా రెండు విభాగాల్లో బడతాయి—సినిమా విభాగం,సోషల్ మీడియా విభాగం
సినిమా విభాగం:
ఈ విభాగంలో ఉత్తమ నటుడు, ఉత్తమ నట్రి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నేపథ్య సంగీతం వంటి అనేక విభాగాల్లో అవార్డులు ప్రకటించబడతాయి. వినూత్నమైన కథలు, కొత్త టాలెంట్కు ప్రోత్సాహంగా ఈ అవార్డులు నిలుస్తాయి.
సోషల్ మీడియా విభాగం:
ఈ విభాగం సోషల్ మీడియా వేదికల్లో ప్రభావాన్ని చూపిన ఇన్ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు గౌరవంగా నిలుస్తాయి.యువతలో స్పూర్తిగా నిలుస్తున్న టాలెంట్ను గుర్తించి అవార్డులతో సత్కరించడం కళారాజ్ సంస్థ ప్రధాన లక్ష్యం.
ముఖ్య అతిధులు:
ఈ వేడుకకు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా స్టార్లు, మరియు వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరవ్వనున్నారు.
కళారాజ్ సంస్థ దృష్టికోణం:
కళ, సాంకేతికత మరియు సామాజిక ప్రభావానికి వేదికగా నిలవడం–ఇదే కళారాజ్ లక్ష్యం. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యుగంలో ప్రతిభను గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ అవార్డ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ వేడుకతో కళారాజ్ మరింత మంది టాలెంట్లకు ప్రేరణగా నిలుస్తూ, సినీ మరియు డిజిటల్ ప్రపంచానికి మధుర జ్ఞాపకాల్ని అందిస్తుంది.ఈ వేడుకకు మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు