కళారాజ్ సోషల్ మీడియా మరియు సినిమా అవార్డ్స్–2025
- July 06, 2025
హైదరాబాద్: సోషల్ మీడియా మరియు సినీ ప్రపంచాన్ని గౌరవించే ఉద్దేశంతో కళారాజ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా సోషల్ మీడియా & సినిమా అవార్డ్స్–2025 వేడుక హైదరాబాద్ లో ఈ నెల20న T-Hub లో నిర్వహించబడుతోందని కళారాజ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ మర్రి తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవ్వనున్నారు.
ఈ అవార్డ్స్ ప్రధానంగా రెండు విభాగాల్లో బడతాయి—సినిమా విభాగం,సోషల్ మీడియా విభాగం
సినిమా విభాగం:
ఈ విభాగంలో ఉత్తమ నటుడు, ఉత్తమ నట్రి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నేపథ్య సంగీతం వంటి అనేక విభాగాల్లో అవార్డులు ప్రకటించబడతాయి. వినూత్నమైన కథలు, కొత్త టాలెంట్కు ప్రోత్సాహంగా ఈ అవార్డులు నిలుస్తాయి.
సోషల్ మీడియా విభాగం:
ఈ విభాగం సోషల్ మీడియా వేదికల్లో ప్రభావాన్ని చూపిన ఇన్ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లకు గౌరవంగా నిలుస్తాయి.యువతలో స్పూర్తిగా నిలుస్తున్న టాలెంట్ను గుర్తించి అవార్డులతో సత్కరించడం కళారాజ్ సంస్థ ప్రధాన లక్ష్యం.
ముఖ్య అతిధులు:
ఈ వేడుకకు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా స్టార్లు, మరియు వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు హాజరవ్వనున్నారు.
కళారాజ్ సంస్థ దృష్టికోణం:
కళ, సాంకేతికత మరియు సామాజిక ప్రభావానికి వేదికగా నిలవడం–ఇదే కళారాజ్ లక్ష్యం. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యుగంలో ప్రతిభను గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ అవార్డ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ వేడుకతో కళారాజ్ మరింత మంది టాలెంట్లకు ప్రేరణగా నిలుస్తూ, సినీ మరియు డిజిటల్ ప్రపంచానికి మధుర జ్ఞాపకాల్ని అందిస్తుంది.ఈ వేడుకకు మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'