జీవితకాల గోల్డెన్ వీసా వార్తలు అవాస్తమని ఖండించిన యూఏఈ
- July 09, 2025
అబూధాబి: యూఏఈ ప్రభుత్వం కొన్ని జాతీయులకు జీవితకాల గోల్డెన్ వీసా మంజూరు చేస్తోందన్న వార్తలు అసత్యమని, అవి అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ ఫెడరల్ అథారిటీ (ICP) ఖండించింది.
ఐసీపీ తెలిపిన ప్రకారం, గోల్డెన్ వీసా మంజూరుకు సంబంధించిన కేటగిరీలు, అర్హతలు, నిబంధనలు స్పష్టంగా ఆధికారిక చట్టాలు, నియమాలు మరియు మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం నిర్ణయించబడ్డాయి. వీసాలకు సంబంధించి సరైన సమాచారం కోసం ఐసీపీ అధికారిక వెబ్సైట్ లేదా స్మార్ట్ యాప్ను ఉపయోగించాలని సూచించింది.
గోల్డెన్ వీసా దరఖాస్తులు యూఏఈలోని అధికారిక ప్రభుత్వ ఛానళ్ల ద్వారానే పరిష్కరించబడతాయని స్పష్టం చేసింది. దేశీయంగా లేదా విదేశాలలోని ఎటువంటి కన్సల్టెన్సీ సంస్థలు అధికారికంగా గుర్తించబడలేదని తెలియజేసింది.
ఇటీవల కొన్ని విదేశీ కన్సల్టెన్సీలు బయట దేశాల నుంచే గోల్డెన్ వీసా పొందవచ్చని, సరళమైన నిబంధనలతో అన్ని వర్గాలకూ మంజూరవుతుందని పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేసినట్లు ఐసీపీ గుర్తించింది. ఈ వ్యాఖ్యలకు ఎలాంటి చట్టపరమైన ప్రాతిపదికా లేదని తెలిపింది.
భద్రతతో కూడిన, పారదర్శకమైన సేవలందించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఐసీపీ స్పష్టం చేసింది. అధికారిక డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారానే సేవలు మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
తప్పుడు ప్రచారాలు నిర్వహించి ప్రజల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.యూఏఈలో నివాసం, పర్యటన లేదా పెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారు ఇలాంటి తప్పుదారి చూపించే వార్తలపై నమ్మకం ఉంచకూడదని, ఎవరూ ఎటువంటి ఫీజులు చెల్లించకూడదని సూచించింది.
తదుపరి చర్యల కోసం ఎప్పుడూ అధికారిక వెబ్సైట్ లేదా 600522222 నంబరులో 24/7 అందుబాటులో ఉండే కాల్ సెంటర్ను సంప్రదించాల్సిందిగా ఐసీపీ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







