జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్..
- July 09, 2025
యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించడం చాలా సులభం (YouTube Monetization Rules) అనేవారికి నిజంగా షాకే.. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్లో అతిపెద్ద మార్పులు చేస్తోంది. ఈ కొత్త రూల్స్ జూలై 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఏఐ కంటెంట్, కాపీ కంటెంట్ పబ్లీష్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై ఎఫెక్ట్ పడనుంది. ఏకంగా మానిటైజేషన్ కూడా కోల్పోవచ్చు..
యూట్యూబ్ ఛానెల్స్ సంఖ్య చాలా పెరిగాయి. ఏఐ ఉపయోగించి ఈజీగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది యూట్యూబ్ క్రియేటర్లు ఇతరుల వీడియోలలో స్వల్ప మార్పులు చేసి తెగ అప్లోడ్ చేస్తున్నారు. పాత వీడియోలను మళ్లీ మళ్లీ అప్లోడ్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు YouTube వీటన్నింటికీ చెక్ పెట్టబోతోంది.
యూట్యూబ్ కొత్త రూల్స్ ఏంటి?
జూలై 15, 2025 నుంచి ఒకే వీడియోను పదే పదే అప్లోడ్ చేయడం లేదా వేరొకరి వీడియోను పోస్ట్ చేసేవారికి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. పైగా ఆ యూట్యూబ్ ఛానల్కు ఉన్న మానిటైజేషన్ కూడా పోతుంది.
యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన వీడియోల క్వాలిటీని మెరుగుపర్చేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా యూట్యూబ్ నియమాలను కఠినతరం చేస్తోంది. రియల్ కంటెంట్ క్రియేటర్లను ప్రొటెక్ట్ చేయడం, ప్లాట్ఫారమ్ను దుర్వినియోగం చేసే ఛానెల్స్ సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







