జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్..
- July 09, 2025
యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించడం చాలా సులభం (YouTube Monetization Rules) అనేవారికి నిజంగా షాకే.. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్లో అతిపెద్ద మార్పులు చేస్తోంది. ఈ కొత్త రూల్స్ జూలై 15 నుంచి అమల్లోకి వస్తాయి. ఏఐ కంటెంట్, కాపీ కంటెంట్ పబ్లీష్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై ఎఫెక్ట్ పడనుంది. ఏకంగా మానిటైజేషన్ కూడా కోల్పోవచ్చు..
యూట్యూబ్ ఛానెల్స్ సంఖ్య చాలా పెరిగాయి. ఏఐ ఉపయోగించి ఈజీగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది యూట్యూబ్ క్రియేటర్లు ఇతరుల వీడియోలలో స్వల్ప మార్పులు చేసి తెగ అప్లోడ్ చేస్తున్నారు. పాత వీడియోలను మళ్లీ మళ్లీ అప్లోడ్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు YouTube వీటన్నింటికీ చెక్ పెట్టబోతోంది.
యూట్యూబ్ కొత్త రూల్స్ ఏంటి?
జూలై 15, 2025 నుంచి ఒకే వీడియోను పదే పదే అప్లోడ్ చేయడం లేదా వేరొకరి వీడియోను పోస్ట్ చేసేవారికి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. పైగా ఆ యూట్యూబ్ ఛానల్కు ఉన్న మానిటైజేషన్ కూడా పోతుంది.
యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన వీడియోల క్వాలిటీని మెరుగుపర్చేందుకు యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా యూట్యూబ్ నియమాలను కఠినతరం చేస్తోంది. రియల్ కంటెంట్ క్రియేటర్లను ప్రొటెక్ట్ చేయడం, ప్లాట్ఫారమ్ను దుర్వినియోగం చేసే ఛానెల్స్ సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







