భారత రాయబారితో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం చర్చలు..!!

- July 11, 2025 , by Maagulf
భారత రాయబారితో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం చర్చలు..!!

కువైట్: భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాతో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భద్రతా రంగాలలో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. మంత్రి షేక్ ఫహద్‌తో జరిగిన సమావేశంలో భారత రాయబారి భద్రత, నేరాలు, నైపుణ్య మార్పిడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకునే మార్గాలపై చర్చించారు. భారత రాయబారి ముఖ్యమైన ద్వైపాక్షిక పరిణామాలను మంత్రికి వివరించారు. కువైట్‌లోని భారతీయ డయాస్పోరా సంక్షేమానికి సంబంధించిన విషయాలను తెలియజేశారని ఎంబసీ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com