సింథటిక్ డ్రగ్ ల్యాబ్ కేసు.. నిందితుడిని భారత్ కు అప్పగించిన యూఏఈ..!!

- July 12, 2025 , by Maagulf
సింథటిక్ డ్రగ్ ల్యాబ్ కేసు.. నిందితుడిని భారత్ కు అప్పగించిన యూఏఈ..!!

యూఏఈః ఇండియాలో నమోదైన మాదకద్రవ్యాల కేసులో కీలక నిందితుడిని యూఏఈ అప్పగించినట్లు భారత అధికారులు తెలిపారు. సింథటిక్ డ్రగ్ తయారీ కేంద్రాన్ని నిర్వహించడంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కుబ్బవాలా ముస్తఫాను భారతదేశ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఇంటర్పోల్, అబుదాబిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సమన్వయంతో భారతదేశానికి అప్పగించారు.
CBI విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ముంబై పోలీసుల నలుగురు సభ్యుల బృందం ఈ వారం ప్రారంభంలో దుబాయ్ వెళ్లి జూలై 11న ముస్తఫాను తిరిగి ముంబైకి తీసుకువచ్చింది.  
ముస్తఫాపై 2024లో ముంబైలో కేసు నమోదైంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో సింథటిక్ డ్రగ్ ల్యాబ్ను నడుపుతున్నట్లు కేసు నమోదు చేశారు.  అక్కడి నుండి 126 కిలోలకు పైగా మెఫెడ్రోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడి కోసం 2024 నవంబర్లో ఇంటర్పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. జూన్లో NCB-అబుదాబి నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు ముందుకువచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com